YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, అవినాష్ సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిలపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎనిమిదవ నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14 న కోర్టుకు హజరు కావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డిని ఏప్రిల్ 14న, వైఎస్ భాస్కరరెడ్డిని ఏప్రిల్ 16న అరెస్టు చేసిన విషయం విదితమే. వీరు చంచల్ గూడ జైలులో అండర్ ట్రైల్ ఖైదీలుగా ఉన్నారు. ఈ రోజు సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులను పోలీసులు హజరపర్చారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అప్సెంట్ పిటిషన్ వేశారు. కాగా నిందితుల రిమాండ్ ను ఆగస్టు 14 వరకూ సీబీఐ కోర్టు పొడిగించింది.
ముందస్తు బెయిల్ పై ఉన్న అవినాష్ రెడ్డి వ్యక్తిగతంగా ఆగస్టు 14న హజరయ్యే విధంగా చూడాలంటూ సీబీఐకి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది. మరో పక్క తెలంగాణ హైకోర్టు .. వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. కాగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీటులో ఏ 9 ప్రకాష్, ఏ – 10 కృష్ణారెడ్డిలను అనుమానితులుగా పేర్కొంది సీబీఐ.
Supreme Court: ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్