నమీబియా నుండి బారత్ (కునో పార్క్) కు తీసుకువచ్చిన చిరుత పులులలో మరొక చిరుత (సూరజ్) శుక్రవారం మృత్యువాత పడింది. గత అయిదు నెలల కాలంలో మొత్తం ఏడు చిరుత పులులు మృతి చెందాయి. సూరజ్ మృతితో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. సూరజ్ వయసు నాలుగు సంవత్సరాలు. అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రాజెక్టు చీతాలో భాగంగా ఆఫ్రికా నుండి ప్రత్యేక విమానాల్లో చిరుత పులులను తీసుకురావడం జరిగింది. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూనో పార్క్ లో వదిలారు.
అయితే ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతూ వచ్చాయి. నాలుగు రోజుల క్రితం మగ చిరుత తేజాస్ చనిపోయిన ఘటన మరువకముందే సూరజ్ మృత్యువాత పడటం కూనో జాతీయ వనం వర్గాలను కలవరానికి గురి చేస్తొంది. సూరజ్ మృతికి కారణాలు ఏమిటి అనేది ఇంకా తెలియరాలేదు. అంతకు ముందు ఆడ చిరుత సియాయ (జ్వాల) నాలుగు చిరుత కూనలను జన్మనివ్వగా అందులో రెండు చనిపోయాయి. అవి డీహైడ్రేషన్ వల్ల మృతి చెందాయని జ్యూపార్క్ సిబ్బంది తెలియజేశారు. తేజాస్ మాత్రం కొట్లాట లో గాయపడి చనిపోయింది. ఇప్పటి వరకూ ఎనిమిది చిరుతలు చనిపోవడంతో కూనో జాతీయ వనంలో ప్రస్తుతం పది చిరుతలు మాత్రమే మిగిలాయి.
YS Viveka Case: వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు