తెలుగుదేశం పార్టీ నేత , మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ . హఫీజ్ పేట భూవివాదంలో అఖిల దంపతులపై కేసు నమోదు కావడం , ఆమెను జైలుకు పంపించడం , భర్త ఇంకా పరారీలో ఉండటం సంచలనం సృష్టిస్తోంది.
హఫీజ్ పేట భూవివాదం కిడ్నాప్ కేసులో ఆమె అరెస్టయిన తర్వాత అనేక సంచలన పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నింటికంటే షాకింగ్ అంశం…. టీడీపీ మౌనం వహించడం
చంద్రబాబు , లోకేష్ … ఇదే ట్విస్ట్
గత కొద్దికాలంగా టీడీపీ నేతలకు ఎదురవుతున్న వివాదాల విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతలపై ఎక్కడ కేసులు నమోదైనా, దాడులు చేసినా వెంటనే స్పందిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ కేసుల వ్యవహారంపై అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఘాటుగానే స్పందించారు. ప్రొద్దుటూరులో ఓ సాధారణ కార్యకర్తను హత్య చేస్తే మర్నాడే అక్కడకు వెళ్లి ధర్నా చేశారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ నేత హత్య జరిగింది. లోకేష్ అక్కడకి కూడా హుటాహుటిన వెళ్లారు.కానీ అఖిలప్రియ విషయంలో సైలెంట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషయంలో పలు వార్తలు వైరల్ వైరల్ అయినా టీడీపీ పెద్దల నుంచి స్పందన రాలేదు.
అఖిలప్రియ … ఆఖరికి ఇలా
అఖిలప్రియ ఎపిసోడ్ ఇంత చర్చనీయాంశంగా మారినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాటమాత్రం కూడా స్పందిచకపోవడం పట్ల చర్చ జరుగుతోంది. అయితే, దీనికి అఖిలప్రియ పై గతంలో వచ్చిన వివాదాలే కారణమంటున్నారు. ఆళ్లగడ్డలో కంకర ఫ్యాక్టరీ వివాదం, విజయ మిల్క్ డెయిరీ చైర్మన్ పదవి వివాదం..తాజాగా హఫీజ్పేట భూ వివాదంతో ఆమె పట్ల పార్టీ పెద్దలు ఈ వైఖరి తీసుకునేందుకు కారణం అంటున్నారు. అఖిలప్రియ విషయంలో సైలెంట్ కాకపోతే తాము సైతం ఇరుకునపడతామనే అగ్రనేతలు సైలెంట్ అయ్యారని అంటున్నారు.