Tirumala: రెండు రోజుల క్రితం తిరుమల మెట్ల మార్గంలో ఓ చిరుత బాలికపై దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికార యంత్రాంగం అలిపిరి నడక మార్గంలో భక్తుల రక్షణకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. మరో పక్క బాలికపై దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు ఘటనా స్థలం (లక్ష్మీనర్శింహస్వామి ఆలయం)తో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల – అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మెట్ల మార్గం సమీపంలో సంచరిస్తున్న చిరుతను బంధించడంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో ప్రమాదం జరగకముందే చిరుతను బోనులో బంధించారు అటవీ శాఖ అధికారులు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్, శశికళ దంపతులు వారి కుమార్తె లక్షిత (6)తో శుక్రవారం అలిపిరి నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళుతుండగా, శ్రీలక్ష్మినర్శింహస్వామి ఆలయ సమీపంలో బాలికపై చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. నడక మార్గంలో వెళ్లే భక్తుల్లో ఆందోళన కల్గించింది. గతంలోనూ ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించి అటవీ శాఖ అధికారులు కల్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయినా మరో చిరుత అటవీ ప్రాంతం నుండి మెట్ల మార్గానికి వచ్చి బాలికపై దాడి చేసి పొట్టన పెట్టుకుంది.
Vyuham RGV: ఆ టీడీపీ నేతలకు థాంక్స్ చెప్పిన ఆర్జీవీ .. వ్యూహం మువీపై కీలక వ్యాఖ్యలు