CM Jagan Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కాసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు పీఎం మోడీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తొంది. ప్రధానంగా రుణ పరిమితిపై సీలింగ్ ఎత్తివేత, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు, విభజన చట్టంలోని హామీలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం శాతం పెంపుతో సహా పలు కీలక అంశాలపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. అదే విధంగా దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి జరిగిన ఒప్పందాలు తదితర విషయాలను వివరించినట్లు భావిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
CM Jagan Delhi Tour: ఆర్ధిక అంశాలతో పాటు
ఇదే సందర్భంలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది సేపటిలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ బేటీ కానున్నారు. ఆ తరువాత రాత్రికి అపాయింట్మెంట్ ఖరారు అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ అవ్వనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం జగన్ ఒక్క రోజు వ్యవధిలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావడంతో ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా డిస్కషన్ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే ప్రధాన మంత్రి మోడీతో చర్చించేందుకు సీఎం జగన్ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ వాదనలను వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలకు మాదిరిగా అధికార పార్టీ నేతలు కూడా జనాల్లోకి వెళుతూ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో టీడీపీ వాదనకు బలం చేకూరుతోంది.