NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: కూతురు కోసం రాచమల్లు చేసింది తెలిసి, ఫోన్ చేసి మరీ మెచ్చుకున్న జగన్ !

YS Jagan: పరువు హత్యలు జరుగుతున్న నేటి సమాజంలో ఓ అధికార పార్టీకి ప్రజా ప్రతినిధి చేసిన పని ఆదర్శవంతంగా నిలుస్తొంది. సదరు ఎమ్మెల్యే ప్రశంసలు అందుకుంటున్నారు. తమ కుమార్తెను ప్రేమించిన వాడు తమ మతం కాదు, తమ కులం కాదు. తమ స్థాయి కాదు అన్న కారణంతో వాళ్లను విడదీయడమో లేక ప్రేమించిన యువకుడిని హత్య చేయించడం, లేదా తమ కుమార్తెనే పొట్టనబెట్టుకోవడం లాంటి సంఘటనలు ఇంతకు ముందు సమాజంలో ఎన్నో జరిగాయి.

 

ఇటువంటి పరువు హత్యలు జరుగుతున్న పరిస్థితులు కొనసాగుతుండగా తమ స్థాయి, హోదా, కులం కాకపోయినా తన కుమార్తె ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించి ఆదర్శ ప్రాయుడుగా నిలిచారు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి పెద్ద కుమార్తె పల్లవి ప్రొద్దుటూరుకే చెందిన కమ్మర లీలా గోపీ పవన్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడి కులం వేరు అయినప్పటికీ, ఆయన స్థాయి కాకపోయినప్పటికీ వారి ప్రేమను గౌరవించారు ఎమ్మెల్యే రాచమల్లు. వారికి ఆదర్శ వివాహం జరిపించారు.

 

ముందుగా బొల్లవరంలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి జరిపించారు. అనంతరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వారికి రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివే సమయంలో పవన్ కుమార్ ను ప్రేమించిందన్నారు. తన కుమార్తె ఇష్టప్రకారం తాను మనస్పూర్తిగా ప్రేమ వివాహం జరిపించానని చెప్పారు. పవన్ కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్ గా పని చేస్తున్నారని చెప్పారు. తన కుమార్తె ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని అన్నారు.

 

వాస్తవానికి ఈ వివాహం ఘనంగా చేయాలని తాను భావించినప్పటికీ తన కుమార్తె అందుకు ఒప్పుకోకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని తెలిపారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు యుక్త వయస్సు వచ్చిన పిల్లల మనోభావాలు, అభీష్టాలను గౌరవించాలని ఈ సందర్భంగా సూచించారు. తనకు కులం, స్థాయి అన్న బేదాభిప్రాయాలు ఏమీ లేవనీ అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు చేసిన ఈ పనికి పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాచమల్లు చేసిన ఆదర్శ వివాహం గురించి తెలిసి ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారని అంటున్నారు.

G 20 Summit: జీ 20 సదస్సులకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేశ రాజధాని ఢిల్లీ .. బ్రిటన్ ప్రధానిగా, భారత దేశ అల్లుడు రిషి సునాక్ సతీసమేతంగా..

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju