Corona: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. కరోనా విస్తృతికి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న సమయంలో పలు కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై వివిధ వర్గాలు చేస్తున్న ప్రచారం విషయంలో రెండు వార్నింగ్ వార్తలు వెలుగులోకి వచ్చాయి.
మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదు అని అన్నారు. మన దగ్గర పేషేంట్లకు సరిపడా బెడ్స్ ఉన్నాయి, టీకాలు, మందులు ఉన్నాయి అని చెప్పిన ఆయన చికిత్స కు ముందుగా వచ్చిన వారు బతుకుతున్నారు అని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఆక్సిజన్ కొరత లేదు. 80 టన్నుల ఆక్సిజన్ తెప్పిస్తున్నాం. ఏ కొంచెం లక్షణాలు ఉన్నా డాక్టర్స్ ని కలవాలి. ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ వస్తోంది. టెస్టుల ఫలితాలు వచ్చే వరకు అగొద్దు. నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయి అని అన్నారు.
పోలీసుల వార్నింగ్
తెలంగాణలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. నైట్ కర్ఫ్యూ తొలి రోజు నుంచే పోలీసులు కొడుతున్నారంటూ.. చాలామంది వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేసే వారిపైన, షేర్ చేసే వారిపైన సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అలాంటి వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు. కరోనా సహా వివిధ అంశాలపై ఫేక్ వార్తలు సృష్టించే వారికి ముందుగానే పోలీసులు హెచ్చరిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.