MP Raghurama: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారన్న నేరంపై రూ.40 కోట్ల జరిమానా విధించింది. మారిషన్ కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ కంపెనీ 2011 మార్చి నెలలో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ లోకి రూ.202 కోట్ల విదేశీ పెట్టుబడులను పెట్టింది.
ఇండ్ భారత్ సన్ ఎనర్జీ లిమిటెడ్ సేకరించిన రూ.202 కోట్లలో రూ.200 కోట్లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ..ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కల్) కు మళ్లించింది. ఇలా నిబంధనలకు విరుద్దంగా నిధులను బదలాయించడంపై ఈడీ విచారణ జరిపింది. 2017 లో షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన ఈడీ .. ఫెమా ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించింది. దీంతో రఘురామ సంస్థకు రూ.40 కోట్ల జరిమానా విధించింది. అయితే దీనిపై రఘురామ కు చెందిన సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది.