Corona: దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుండగా మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం క్రియాశీలంగానే సాగుతోంది. మనదేశంలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు వ్యాక్సిన్లు రెండు డోసులుగా తీసుకోవాలి. ఇప్పటికే ఈ మేరకు సంబంధిత వర్గాలు పొందుతున్నాయి. అయితే, తాజాగా ఇంకో గుడ్ న్యూస్. మనదేశంలో త్వరలోనే మూడో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ కరోనా వ్యాక్సిన్.. సింగిల్ డోస్ టీకా వేసుకుంటే చాలు అనేది అసలు శుభవార్త.
ఇప్పుడు ఏం జరుగుతోంది?
మనదేశంలో ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసుల టీకాలే. మొదటి డోసు తీసుకున్నాక.. 28 రోజుల వ్యవధిలో రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ఫార్మా సంస్థలు సింగిల్ డోస్ వ్యాక్సిన్పై కొంతకాలంగా.. పరిశోధనలు చేస్తున్నాయి. అందులో జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్న టీకా ఒకటి. తాజాగా ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.
కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ను రూపొందించిన అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్.. ఎమర్జెన్సీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాల కంటే సమర్థంగా ఈ వ్యాక్సిన్ పనిచేయనున్నట్టు తెలిపింది.
త్వరలోనే…
భారత్లో బయోలాజికల్-ఈ సంస్థతో కలిసి జాన్సన్ అండ్ జాన్సన్ ఈ కొత్త వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీలో మాస్ ప్రొడ్యూసర్గా బయోలాజికల్-ఈ ఉంది. ఇప్పటికే ఫేస్ వన్, ఫేస్ టు ట్రయల్స్ నిర్వహిస్తున్న బయోలాజిక్ ఈ.. త్వరలోనే మూడో దశ ట్రయల్స్ కోసం డీసీజీఐ నుంచి అనుమతులు కోరనుంది. తదుపరి ట్రయల్స్ కూడా సక్సెస్ అయితే.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.