Chandrababu: ఇసుక కేసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. విచారణ సందర్భంలో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకూ అరెస్టు చేయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇసుక కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు పిటిషన్ ఇవేళ విచారణకు రాగా.. తాము చంద్రబాబును ఈ నెల 28 వరకు అరెస్టు చేయబోమని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీఐడీ న్యాయవాదుల స్టేట్ మెంట్ రికార్డు చేసిన చేసిన ధర్మాసనం .. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా ఏపీ హైకోర్టు ఈ నెల 28వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
మధ్యంతర బెయిల్ మంజూరు అియిన నేపథ్యంలో 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి విడుదల అయిన చంద్రబాబు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం రెండు రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
Tummala Nageswara Rao: తుమ్మల నివాసంలో పోలీసుల సోదాలు