Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరో సారి చుక్కెదురైంది. చంద్రబాబు తరపున దాఖలైన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోపుగా సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపితే క్వాష్ పిటిషన్ ప్రభావం పడుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఏపీ స్కిల్ డెలవ్ మెంట్ సంస్థలో నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే అరోపణలో ఏపీ సీఐడీ తన పై నమోదు చేసి కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తన పాత్రపై ప్రాధమిక ఆధారాలు లేకపోయినా, చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేకపోయినా, రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా తన పేరు చేర్చారనీ, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ లో కోరారు.
ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చే లోపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ పిటిషన్ పై ఇవేళ విచారణ జరిపిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ కి ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 18వ తేదీన విచారణ జరగనున్నది. అప్పటి వరకూ సీఐడీ దాఖలు చేసిన కష్టడీ పిటిషన్ పై విచారణ చేయవద్దంటూ ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Nara Lokesh: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయం .. కేంద్ర పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి చేరిన నారా లోకేష్