YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో కీలక ప్రకటన చేయనున్నారా? వచ్చే వారంలోనే రెండు ముఖ్యమైన ప్రకటనలు ఏపీ సీఎ సారథ్యంలో వెలవడనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ జిల్లా టూర్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం ఏపీ సీఎం ఆధ్యర్యంలోని కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు వెలువరించనుందని చెప్తున్నారు. ఏపీ కేబినెట్ ఈ నెల 23న సమావేశం కానుంది. 2021-22 బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలతో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండటమే కాకుండా మరిన్ని ముఖ్య విషయాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
YS Jagan :విశాఖ ఉక్కుపై కీలక నిర్ణయం ?
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పర్యటించిన సీఎం జగన్ కార్మిక సంఘాల నాయకులతో చర్చించారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకవైపున చేయాల్సినవన్నీ చేస్తాం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పెడతామని తెలిపారు. దీనికి ముందు జరగబోయే ఈ కేబినెట్ సమావేశంలో విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలని భావిస్తున్నారని సమాచారం. తద్వారా కేంద్రానికి ఏపీ సర్కారు తరఫున బలమైన సందేశం పంపునున్నట్లు చెప్తున్నారు.
కొత్త రాజధాని రెడీ అయిపోతోంది
మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో ఉగాది నాడు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. సచివాలయ కార్యాలయాలు విశాఖకు తరలివెళ్లాలంటే కనీసం రెండు నెలలన్నా కావాలన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో రాజధాని తరలింపు కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితో పాటుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో పాటూ కీలక అంశాలపై చర్చించనున్నారు.