KA Paul : కేఏ పాల్ …. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. రాజకీయాల్లో ఆయనది విభిన్నమైన శైలి. నిర్మొహమాటంగా తన మనసులోని మాటలను చెప్పే అతికొద్దిమంది నేతల్లో కేఏ పాల్ ఒకరు. అలాంటి కేఏ పాల్ ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా ఏపీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఎందుకంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోంది.. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు కదులుతున్నాయి. ఈస్టీల్ ప్లాంట్ విషయంలో కీలక ప్రకటన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేశారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు జవాబు ఇచ్చిన ధర్మేంద్ర ప్రధాన్.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబరిచిందని రాజ్యసభ వేదికగా ప్రకటించారు. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేశారు. అంతటితోనే ఆయన ఆగిపోలేదు…
KA Paul కేఏ పాల్ ఏం చేశారంటే…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టు కోరుతూ కేఏ పాల్ తరఫున జ్యోతిబగల్ పిటిషన్ దాఖలు చేశారు. కేపిటల్ మైనింగ్ అంశంలో విశాఖ స్టీల్ ప్లాంట్కు లీజు పర్మిషన్ వచ్చేలా చూడాలని కేఏ పాల్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి విరాళాలు సేకరిస్తానన్నారు. సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖను పిటిషన్లో కేఏ పాల్ ప్రస్తావించారు. ప్రతివాదులుగా కేంద్ర మైనింగ్ డిపార్ట్మెంట్, కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్, విశాఖ స్టీల్ ప్లాంట్, కేంద్ర స్టీల్ డిపార్ట్మెంట్, ఏపీ సీఎస్ను చేర్చారు. పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
షర్మిలకు ఓపెన్ ఆఫర్
షర్మిల కొత్త పార్టీ గురించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలుగా షర్మిల పార్టీ ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టవద్దు అన్నది జగన్ అభిప్రాయం అని ఆయన అన్నారు. పార్టీ పెట్టడం వల్ల ఉండే ఇబ్బందులు కూడా ఆమెకు చెప్పటం జరిగిందని అన్నారు. మరోవైపు షర్మిల తన పార్టీలో చేరాలని అన్నారు.