Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అదే క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సీబీఐ అధికారులు రూ.5లక్షల పూచికత్తుతో బెయిల్ పై విడుదల చేశారు. అయితే ఈ వ్యవహారం గత శనివారం జరిగింది కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31వ తేదీన అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హజరు కావాలని, సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనీ తదితర షరతులను విధించింది.
అంతే కాకుండా అరెస్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే రూ.5లక్షల పూచికత్తుతో బెయిల్ పై విడుదల చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని వైఎస్ వివేకా హత్య కేసులో 8వ నిందితుడుగా పేర్కొంది సీబీఐ. శనివారం సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం హజరైన సమయంలోనే అరెస్టు, బెయిల్ వ్యవహారాలను పూర్తి చేసింది సీబీఐ. అయితే గత శనివారం నాడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినప్పటికీ సీబీఐ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల కాలం వరకూ వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని అనుమానితుడుగా భావిస్తూ వచ్చిన సీబీఐ.. తాజాగా 8వ నిందితుడుగా పేర్కొంది.
మరో సారి సీఎం వైఎస్ జగన్ ను కలిసిన అంబటి రాయుడు