National Green Tribunal: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కీలక వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలని ఎన్జీటీ గతంలో తీర్పు ఇచ్చినా ఏపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం ఎన్జీటీ విచారణ జరిపింది. తీర్పును దిక్కరించి పనులు కొనసాగిస్తే సీఎస్ను జైలుకు పంపుతామని ఎన్జీటీ హెచ్చరించింది.
పనులు నిలిపివేసి పర్యావరణ అనుమతుల కోసం ధరఖాస్తు చేశామని ఏపి ప్రభుత్వం ఎన్జీటీకి తెలియజేసింది. ఏపి ప్రభుత్వ వాదనలపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన ఎన్జీటీ రాయలసీమ పథకం తాజా పరిస్థితిపై నివేదిక అందజేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు, పర్యావరణ శాఖలను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది.