TTD Jobs: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి అన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏపీకి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్ధుల మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు అన్ లైన్ విధానంలో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్టు సమాచారం, అర్హత, ఎంపిక ప్రక్రియ, వేతనం తదితర విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
మొత్తం ఉద్యోగాలు (56) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 27 పోస్టులు ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 10, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) 19 పోస్టులు ఉన్నాయి.
అర్హత బీఈ, బీటెక్ (సివిల్ మెకానికల్), ఎల్సీఈ/ ఎల్ఎంఈ (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణలై ఉండాలి.
వయో పరిమితి 42 ఏళ్లు మించరాదు.
ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం ఇలా.. నెలకు ఏఈఈకి రూ.57,100 – 1,47,760లు, ఏఈకి రూ.48,440- 1,37,220లు, ఏటీవో పోస్టులకు రూ.37,640 – 1,15,500ల వరకూ వేతనం చెల్లిస్తారు.
ఆసక్తిగల నిరుద్యోగు యువతీ యువకులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే ముందు నోటిపికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు.