Kakinada: కాకినాడ తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణ ఘటన జరిగింది. ఇద్దరు దుండగులు ఓ ఆటోను ఆపి డ్రైవర్ ను డబ్బుల కోసం బెదిరించారు. అతని వద్ద డబ్బులు లాక్కుని కత్తితో దాడి చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ ను రోడ్డు పక్కకు తోసేసి అతని ఆటో తీసుకుని పరారయ్యారు. కొద్ది దూరంలో చిన్న కొట్టు నడుపుతున్న మహిళను గమనించి ఆమె దగ్గరకు వెళ్లి కత్తి చూపించి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆమె భయంతో కేకలు వేయడంతో కత్తితో దాడి చేసి పరారైయ్యారు.
గాయపడిన మహిళను స్థానికులు తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందింది. గాయపడిన ఆటో డ్రైవర్ ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. దుండగులు హిందీ లో మాట్లాడటంతో వారు నార్త్ ఇండియాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.