Visakha Steel Plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఫోరాట కమిటీ తమ ఉద్యమాన్నిఢిల్లీకి తీసుకువెళ్లాలని భావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారానికి 400 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు విశాఖ లో మీడియా సమావేశం ఏర్పాట చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు.
Visakha Steel Plant: ఈ నెల 28న విశాఖ నగర బంద్
ఈ నెల 28న విశాఖ నగర బంద్ కు పిలుపును ఇచ్చింది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వీఎస్ పీ ప్రైవేటీకరణ ను నిరసిస్తూ 28న చేస్తున్న నగర బంద్ కు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వంద మంది పార్లమెంట్ సభ్యులతో సంతకాలను సేకరంచి ఢిల్లీకి వెళ్లి పోరాడతామని చెప్పారు.
ఢిల్లీలో పోరాటం ద్వారా కేంద్రంపై ఒత్తిడి
వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని పరిరక్షణ సమితి నేతలు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను నిరసిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇస్తున్నాయి. సంఘీభావం తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.