NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: డిల్లీ వెళ్ళిన జగన్ – చంద్రబాబు మీద కొత్త స్కాం పట్టుకొచ్చాడు !

Jagan's government has set itself a goal by arresting Chandrababu
Advertisements
Share

YS Jagan: టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ సీఐడీ అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించడం తెలిసిందే. ఆదివారం ఆర్ధరాత్రి నుండి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లోనే ఉన్నారు. ఈ తరుణంలోనే నిన్న ఉదయం సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులు, ముఖ్యనేతలతో చర్చించారుట.

Advertisements

అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు సీఎం జగన్ ను కలిసి కేసుకు సంబంధించి వివరాలు తెలియజేసినట్లు సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో 37వ నిందితుడుగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ .. ఈ కేసులో విచారణ నిమిత్తం కష్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Advertisements

Jagan's government has set itself a goal by arresting Chandrababu

ఇదే క్రమంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో ఏ 1 గా చంద్రబాబు ఉండటంతో ఈ కేసులో అరెస్టు చేసేందుకు కూడా పీటీ వారెంట్ పిటిషన్ ను ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు రిమాండ్ రిపోర్టుపై ఏసీబీ కోర్టులో జరిగిన వాదనల్లో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించడంతో కోర్టు సీఐడీ వాదనకు ఏకీభవిస్తూ రిమాండ్ విధించింది. చంద్రబాబు మీద చాలా కేసులు ఉన్నాయనీ ఇప్పట్లో చంద్రబాబు బయటకు రావడం కష్టమేనని వైసీపీ నేతలు అంటున్నారు.

దీంతో ఆయనపై ఉన్న కేసులు అన్నీ ఇప్పుడు బయటకు తీసి ఒక కేసులో బెయిల్ రాకముందే మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసే అలోచనలో ప్రభుత్వం ఉందన్న వాదనలు వినబడుతున్నాయి. దీంతో ప్రతి కేసులోనూ చంద్రబాబు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును సీఐడీ తో పాటు ఈడీ కూడా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఈడీ కూడా రంగంలోకి దిగితే చంద్రబాబు మరింత ఇరుకునపడతారు అనే మాట వినబడుతోంది.

What is this inner ring road case.. If found in this, Tihar Jail is guaranteed for Chandrababu
Chandrababu

అందుకే లండన్ నుండి వచ్చిన వెంటనే సీఎం జగన్ .. ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లతో భేటీ అయి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు చర్చించడంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అంశంలో ఈడీ దర్యాప్తును వేగవంతం చేయాలని కోరే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ ఈ సంక్షోభం నుండి బయటపడే లోపుగానే ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనే విషయాలపైనా చర్చించి తదనుగుణంగా చర్యలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

TDP: పాపం చంద్రబాబు జైల్లో ఉన్నాడు అన్న బాధ కూడా లేకుండా తెలుగు తమ్ములు ఏం చేస్తున్నారో చూడండి !


Share
Advertisements

Related posts

Samantha: సమంతపై కన్నేసిన ప్రియమణి భర్త.. అందులో తప్పేముంది అంటూ ప్రియమణి సపోర్ట్.!

Ram

TDP vs Jr NTR: టీడీపీకి అసలు విలన్ ఎన్టీఆర్..! జూనియర్ టార్గెట్ 2029..!?

Srinivas Manem

600 కోట్ల మేటర్ లో చంద్రబాబుని ప్రూఫ్ తో సహా టార్గెట్ చేసిన వైసీపీ..!!

sekhar