జగన్మోహనరెడ్డి సర్కార్ అమలు చేస్తున్న కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ఆర్ధిక సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఈ పథకాల కింద మంజూరు చేసే ఆర్ధిక సాయాన్ని ఇకపై పెళ్లి కూతురు (వధువు) తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల మధ్య ఈ పథకాల కింద ధరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ ఏడాది ఫిబ్రవరి లో ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేసింది.
అయితే అప్పట్లో ఆర్ధిక సాయాన్ని పెళ్లి కూతురు (వధువు) బ్యాంకు ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. అయితే. వివిధ వర్గాల నుండి అందిన వినతుల మేరకు ఈ ఆర్ధిక సాయం పంపిణీలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఆ ఆర్ధిక సాయాన్ని ఇక పై పెళ్లి కుమార్తె తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక వేళ పెళ్లి కుమార్తె తల్లి మరణిస్తే వధువు నిర్ణయం మేరకు ఆమె తండ్రి లేదా అన్నదమ్ములు లేదా గార్డియన్ గా వ్యవహరించే ఇతరుల బ్యాంకు ఖాతాలో ఆర్ధిక సాయాన్ని జమ చేస్తారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లి కానుక గా ఈ పథకాన్ని అమలు చేయగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోగా పేరు మార్పు చేశారు. ఆర్ధిక సాయాన్ని గతం కంటే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తొలి మూడేళ్లు ఈ పథకాన్ని అమలు చేయలేదు. గత ఏడాది నుండే ఈ పథకాన్ని పునరుద్దరించారు. అయితే ఈ పథకంలో పలు మార్గదర్శకాలను నిర్దేశించారు.
బీజేపీలోకి పొంగులేటి, జూపూల్లి ..? మూహూర్తం ఫిక్స్ అయినట్లే(నా)..!