ఎన్నడూ లేని విధంగా కొద్దిరోజులుగా నందమూరి నట వారసుడు బాలకృష్ణ వార్తల్లో చాలా ఎక్కువగా కనబడడం చూస్తూ ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ చాలా పేరొందిన పర్సనాలిటీ అయినా ఎప్పుడో అడపాదడపా అభిమానులను కొట్టినప్పుడో…. స్టేజీపైన విచక్షణ లేకుండా మాట్లాడినప్పుడో అతని పేరు తెరమీదకు వచ్చేది…. మళ్ళీ కొద్ది రోజులకి కనుమరుగయ్యేది. కానీ గత వారం నుండి బాలకృష్ణ పేరు సోషల్ మీడియా తో పాటు ఇటు డిజిటల్ మీడియా లో మార్మోగిపోతోంది. సరే బాలయ్య ఇంత యాక్టివ్ గా ఉండడం వల్ల అతని ఇమేజ్ కు లేదా అతని పార్టీకి ఏదైనా లాభం చేకూరుతుంది అంటే…. లేదనే చెప్పాలి.
అసలు ఈ తతంగం అంతా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరు ఇంట్లో నిర్వహించిన సినీ పెద్దల సమావేశానికి బాలయ్యని పిలవకపోవడం తో మొదలైంది. దీనికి తీవ్రమైన ఆగ్రహం చెందిన బాలయ్య చాలా దూకుడుగా ఈ విషయంపై స్పందించి భూములు పంచుకోవడానికి అంతా కలిసి సమావేశం అయ్యారు అని ఆరోపణలు చేశాడు. తర్వాత మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య కు విపరీతమైన కౌంటర్ ఇచ్చి అతని మాటను వెనక్కి తీసుకోవాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక రెండు రోజులకి పరిస్థితి సద్దుమణిగిన తరువాత బాలయ్య కు సీఎం జగన్ ను సినీ ప్రముఖులు కలుస్తున్నప్పుడు ఆహ్వానం లభించగా తన పుట్టినరోజు వేడుకలు కారణంగా తాను రాలేనని చెప్పడం గమనార్హం.
సరే ఇక్కడితో ఈ వివాదం అంతా పూర్తయింది ఇండస్ట్రీ అంతా ఒకటే అని సగటు సినిమా ప్రేక్షకుడు అనుకుంటున్న సమయంలో బాలయ్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చిరంజీవి ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించాయి. తరచుగా 80ల తారలు అందరూ రీ–యూనియన్ పార్టీ జరుపుకుంటారు అని…. గతంలో తనను చాలాసార్లు పిలిచారు అని మరి హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్లో ఈ పార్టీ జరిగినప్పుడు మాత్రం తనకు ఆహ్వానం లభించలేదని బాలయ్య మండిపడ్డాడు.” అయినా ఐ డోంట్ కేర్..! నాకు నచ్చిన దారిలో నేను వెళ్తా… నన్ను అలా ట్రీట్ చేసిన వారిని పూర్తిగా అవాయిడ్ చేస్తా“ అంటూ బాలయ్య హాట్ కామెంట్స్ చేశారు.
“నాది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ అని…. చేస్తే పూర్తిగా నన్ను అవాయిడ్ చేయండి….” అని బాలయ్య అన్న మాటలు అతని స్థాయికి తగినట్లుగా లేవని ఆంధ్ర ప్రజానీకం అభిప్రాయం. అలాగే ఈ మాటలు అన్నీ అసలు ఎవరిని బెదిరించడానికి… ఇతరులని రెచ్చగొట్టేలా మాట్లాడే అంత సంకుచిత స్వభావం ఎందుకు వచ్చింది అన్నది అందరి ప్రశ్న. అంతేకాకుండా అహం, గర్వం తమకు ఆభరణాలని…. తమ స్థాయి వేరు అని తాము లైఫ్ దాన్ లైఫ్ సినిమాలు చేశామని బాలయ్య బీరాలు పలకడం తో అటు సినీ ప్రేక్షకులే కాకుండా సాధారణ జనాలు కూడా ముక్కున వేలు వేసుకోవలసి వచ్చింది.
అయితే ఇప్పుడు బాలయ్య కనబరుస్తున్న ఈ ప్రవర్తన మరియు దాని ప్రభావం తెలుగుదేశం పార్టీపై భారీగా పడింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవిని తిట్టడం వల్ల మెగాస్టార్ కు ఎటువంటి నష్టం కాకపోగా అటు టిడిపి పై ప్రజలకు ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. ఇప్పటికే వ్యాఖ్యలపై తెదేపా పై బాగా వ్యతిరేకత పెరిగిందని సోషల్ మీడియా వర్గాలు చెబుతుండగా దానివల్ల వైసిపికి లాభం బారీగా కలిగినట్టు అని వారు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య చేష్టలు, ఎల్లో మీడియా పైత్యం వల్ల అంతిమంగా వైసీపీకి మెగా అభిమానుల ఆదరణ లభిస్తుంది. ఒకవేళ వైసీపీకి కూడా దగ్గర కాలేదనుకున్నా…టీడీపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారు సానుకూలంగా వ్యవహరించరనేది సుస్పష్టం. పరోక్షంగా ఆ విధంగానైనా వైసీపీకి లాభమే. అందువల్ల బాలకృష్ణ తన మాటలతో వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నారని చెప్పక తప్పదు.