TDP YCP; నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో సగటున 76 శాతం పోలింగ్ నమోదవ్వగా.., మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో సగటున 62 శాతం ఓటింగ్ నమోదయింది. పట్టణ ఓటర్లంటే ఇళ్ల నుండి కదలరు.. ఓటు ఎప్పుడూ వేయరు.. కానీ పల్లె ఓటర్లు మాత్రం ఓట్లు అంటే ఆసక్తి చూపిస్తారు.
ఏపీలో ఎప్పుడు పల్లె ఎన్నికలు జరిగినా 72 శాతానికి తగ్గిన సందర్భాలే లేవు. 2014 లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 77 శాతం నమోదవ్వగా…, 2006 లో జరిగిన ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ శాతం నమోదయింది. కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం 60 .64 శాతం మాత్రం పోలింగ్ నమోదయింది. దీని వెనుక కారణాలు.., ఈ పరిణామాలు కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అంశాలే.
TDP YCP; నమోదైన ఓట్లలో కూడా ఎన్నో తేడాలు..!?
నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68 శాతం ఓటింగ్.., అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో 51 శాతం పోలింగ్ నమోదయింది. కొన్ని జిల్లాల్లో చివరి రెండు గంటల్లో అనూహ్యంగా పెరుగుదల కనిపించింది. గుంటూరు, కడప వంటి జిల్లాల్లో చివరి రెండు గంటల్లోనే 20 శాతానికి పైగా నమోదైనట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలు, కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. సో.. నిన్నటి ఎన్నికల్లో నమోదైన ఓట్లలో కూడా కొన్ని తేడాలు ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక పార్టీల వారీగా చూసుకుంటే నిజానికి ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే.., పోలింగ్ వేరేలా ఉండేది. ఎక్కడైనా ప్రత్యర్ధులు గట్టిగా తలపడితేనే పోటీపై ఆసక్తి ఉంటుంది. అలాగే ఎన్నికల్లో ప్రత్యర్ధులు పోటాపోటీగా తలపడి, ప్రచారం చేసి, డబ్బులు పంచితేనే ఓటర్లకు ఓటింగ్ పై ఆసక్తి పుడుతుంది. కానీ ఈ పరిషత్ ఎన్నికలు అలా జరగలేదు. ఏకపక్షంగా జరిగాయి.
టీడీపీ పోటీ చేసి ఉంటె..!?
సహజంగా రాజకీయం అంటే.. రెండు ప్రధాన పార్టీలు ఉన్నప్పుడు వారికీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం వైసీపీకి, టీడీపీకి అటువంటి ఓటు బ్యాంకు ఉంది. సగటున వైసీపీకి 35 శాతం ఫిక్స్ అయినా ఓటు బ్యాంకు ఉంది అనుకుంటే.., టీడీపీకి 30 శాతానికి పైగా ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉంటుంది. వీళ్ళు టీడీపీ పోటీ నుండి బహిష్కరించడంతో ఓటింగ్ పై కొంతమేరకు ఆసక్తి చూపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీడీపీ వాళ్ళు పోటీలో ఉన్నారు. ప్రచారం చేశారు. అటువంటి స్థానాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. రాష్ట్రం మొత్తం ఇదే జరిగితే ఓటింగ్ శాతం కచ్చితంగా పెరిగేది. సో.. పోటీని బహిష్కరించడం ద్వారా చంద్రబాబు తన రాజకీయం చూపిస్తే… ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడం ద్వారా కొన్ని వర్గాల ఓటర్లు కూడా ఎన్నికల పట్ల తమ అనాసక్తిని చూపించారు. ఇది టీడీపీకి విజయం కాదు.., కానీ సీఎం జగన్ కి ఒక చిన్న హెచ్చరిక లాంటిదే.
పడిన 60 శాతంలో కూడా కొన్ని లెక్కలు..!!
నిన్న జరిగిన పోలింగ్ లో 60 శాతం పోలింగ్ నమోదైంది. దీనిలో వైసీపీకి ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉన్న ఓట్లతో సహా.. జగన్ పట్ల, అతని పథకాల పట్ల ఆకర్షితులై వచ్చి వేసిన ఓట్లు లెక్కించుకుంటే.. సరాసరి 45 శాతం వైసీపీకి పడినట్టు ఓ అంచనాగా చెప్పుకోవచ్చు. టీడీపీ పోటీలో లేకపోయినప్పటికీ.. ఆ గుర్తు చూస్తేనే ఓటు వేయాలనిపించేవారు… అక్కడక్కడా పోటీ చేసిన వారికి పడిన ఓట్లు లెక్కించుకుంటే కనీసం 10 శాతం ఆ పార్టీకి వేసుకున్నా.. మిగిలిన ఓట్లు ఇతరులకు లెక్కించుకోవచ్చు. కానీ ఒకవేళ టీడీపీ పూర్తిస్థాయిలో పోటీకి దిగి ఉంటె.. వైసీపీ కూడా యాక్టీవ్ గా పాలిటిక్స్ చేసేది. పోటీ మజాగా ఉండేది. అప్పుడు ఓటింగ్ శాతం పెరిగేది. ఆ లెక్కన వైసీపీకి కూడా ఓట్లు పెరిగేవి. సో… ఎన్నికల బహిష్కరణ ద్వారా చంద్రబాబు వేసిన మంత్రం ఓ లెక్కన ఫలించినట్టే. సీఎం జగన్ అప్రమత్తమై.. సమీక్షించుకోవాల్సిన అంశమే..!!