ఖరారు చేసిన వైసీపీ అధినేత
ఆ మూడో సీటు కాపు..కాపుల్లో ఎవరికి దక్కేనో…!
ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన పలు పేర్లు కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, అందులో తొలుత ఎస్సీ..మైనార్టీ వర్గాలకు కేటాయిస్తున్నారంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ఎస్సీ..కమ్మ నేతకు ఇవ్వాలని నిర్ణయించారనే ప్రచారం సాగింది. ఇక, చివరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందని మోషేన రాజు..మైనార్టీ కోటాలో కడప జిల్లా రాజంపేట నుండి మైనార్టీ నేతకు ఖరారైనట్లు చెప్పారు. కానీ, అసలు చివరి లిస్టులో ఉండేదెవరో తేల్చేసారు. పేర్లు మారిపోయాయి. అదే విధంగా మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం కమ్మ వర్గం నుండి ఒకరి పేరు.. కాపు వర్గం నుండి ఇద్దరి పేర్లు చివరి దశ పరిశీలనలో ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కించుకునే సామాజిక వర్గాలు..సమీకరణాల ఆధారంగా ఈ మూడో సీటు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా…గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లకు వైసీపీ అధినేత సైతం ఆమోద ముద్ర వేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.
పండుల రవీంద్రబాబు పేరు ఖరారు…!
గవర్నర్ కోటా ఇద్దరి పేర్లను వైసీపీ అధినేత ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఎస్సీ..రెండోదీ మైనార్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత ఎస్సీ తో పాటుగా కమ్మ నేతకు ఇస్తారని ప్రచారం సాగినా. ఫైనల్ గా ఈ కోటాలో ఎస్సీ..మైనార్టీకే పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఎస్సీ కోటాలో ఇప్పటి వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ ఏర్పాటు నుండి పని చేస్తున్న మోషేను రాజు పేరు ఖరారైనట్లగా పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే, లిస్ట ఫైనల్ అయ్యే సమయంలో పేరు మారింది. ఎస్సీ కోటాలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ నుండి 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా గెలిచి..2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు పేరు ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనకు వైసీపీలో చేరే ముందు ఇచ్చిన హామీ…జిల్లాల సమీకర ణాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్సీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనతో పాటుగా మైనార్టీ కోటాలో కడప జిల్లా నుండి కొద్ది రోజులుగా ప్రచారం ఉన్న విధంగానే జకియా ఖానుం పేర్లను సీఎం ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.
ఆ సీటు కాపు లేదా కమ్మ నేతల్లో ఎవరికి..
ఇక, మంత్రులుగా ఉన్న పిల్లి సుబాష్ చంద్రబోసు..మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపిక కావటంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. అందులో బోసు పదవీ కాలం మరో 9 నెలలు మాత్రమే ఉండటంతో.. ఆ స్థానం భర్తీకి అవకాశం లేదు. ఇక, మోపిదేవి స్థానం భర్తీ చేసేందుకు కాపు లేదా కమ్మ వర్గం నుండి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేరు కమ్మ వర్గం నుండి తుది పరిశీలనలో ఉంది. కానీ, ఇంకా ఆమోద ముద్ వేయటం లేదు. ఇదే సమయంలో కాపు వర్గం నుండి తూర్పు గోదావరి జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు..ప్రకాశం జిల్లా నుండి ఆమంచి క్రిష్ణ మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం. ఇప్పుడు, గవర్నర్ కోటాలో తూర్పు గోదావరి జిల్లాకు అవకాశం ఇస్తుండటంతో ఇక తోట త్రిమూర్తులకు ఛాన్స్ లేదనే భావించాలి. దీంతో..తుది రేసులో కమ్మ వర్గం నుండి మర్రి రాజశేఖర్..కాపు వర్గం నుండి ప్రకాశం జిల్లా నేత ఆమంచి ఉన్నారు. వీరిద్దరిలో ఒకరి పేరు ఈ రోజు లేదా రేపు సీఎం జగన్ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.