NewsOrbit
బిగ్ స్టోరీ

ఆ ఇద్దిరికే ఎమ్మెల్సీ పదవులు..! ఫైనల్ లిస్టులో కొత్త పేర్లు ..!

ఖరారు చేసిన వైసీపీ అధినేత

ఆ మూడో సీటు కాపు..కాపుల్లో ఎవరికి దక్కేనో…!

 

ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన పలు పేర్లు కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, అందులో తొలుత ఎస్సీ..మైనార్టీ వర్గాలకు కేటాయిస్తున్నారంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.

 

ఆ తరువాత ఎస్సీ..కమ్మ నేతకు ఇవ్వాలని నిర్ణయించారనే ప్రచారం సాగింది. ఇక, చివరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందని మోషేన రాజు..మైనార్టీ కోటాలో కడప జిల్లా రాజంపేట నుండి మైనార్టీ నేతకు ఖరారైనట్లు చెప్పారు. కానీ, అసలు చివరి లిస్టులో ఉండేదెవరో తేల్చేసారు. పేర్లు మారిపోయాయి. అదే విధంగా మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం కమ్మ వర్గం నుండి ఒకరి పేరు.. కాపు వర్గం నుండి ఇద్దరి పేర్లు చివరి దశ పరిశీలనలో ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కించుకునే సామాజిక వర్గాలు..సమీకరణాల ఆధారంగా ఈ మూడో సీటు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా…గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లకు వైసీపీ అధినేత సైతం ఆమోద ముద్ర వేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.

పండుల రవీంద్రబాబు పేరు ఖరారు…!

గవర్నర్ కోటా ఇద్దరి పేర్లను వైసీపీ అధినేత ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఎస్సీ..రెండోదీ మైనార్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత ఎస్సీ తో పాటుగా కమ్మ నేతకు ఇస్తారని ప్రచారం సాగినా. ఫైనల్ గా ఈ కోటాలో ఎస్సీ..మైనార్టీకే పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఎస్సీ కోటాలో ఇప్పటి వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ ఏర్పాటు నుండి పని చేస్తున్న మోషేను రాజు పేరు ఖరారైనట్లగా పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే, లిస్ట ఫైనల్ అయ్యే సమయంలో పేరు మారింది. ఎస్సీ కోటాలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ నుండి 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా గెలిచి..2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు పేరు ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనకు వైసీపీలో చేరే ముందు ఇచ్చిన హామీ…జిల్లాల సమీకర ణాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్సీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనతో పాటుగా మైనార్టీ కోటాలో కడప జిల్లా నుండి కొద్ది రోజులుగా ప్రచారం ఉన్న విధంగానే జకియా ఖానుం పేర్లను సీఎం ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.

ఆ సీటు కాపు లేదా కమ్మ నేతల్లో ఎవరికి..

ఇక, మంత్రులుగా ఉన్న పిల్లి సుబాష్ చంద్రబోసు..మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపిక కావటంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. అందులో బోసు పదవీ కాలం మరో 9 నెలలు మాత్రమే ఉండటంతో.. ఆ స్థానం భర్తీకి అవకాశం లేదు. ఇక, మోపిదేవి స్థానం భర్తీ చేసేందుకు కాపు లేదా కమ్మ వర్గం నుండి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేరు కమ్మ వర్గం నుండి తుది పరిశీలనలో ఉంది. కానీ, ఇంకా ఆమోద ముద్ వేయటం లేదు. ఇదే సమయంలో కాపు వర్గం నుండి తూర్పు గోదావరి జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు..ప్రకాశం జిల్లా నుండి ఆమంచి క్రిష్ణ మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం. ఇప్పుడు, గవర్నర్ కోటాలో తూర్పు గోదావరి జిల్లాకు అవకాశం ఇస్తుండటంతో ఇక తోట త్రిమూర్తులకు ఛాన్స్ లేదనే భావించాలి. దీంతో..తుది రేసులో కమ్మ వర్గం నుండి మర్రి రాజశేఖర్..కాపు వర్గం నుండి ప్రకాశం జిల్లా నేత ఆమంచి ఉన్నారు. వీరిద్దరిలో ఒకరి పేరు ఈ రోజు లేదా రేపు సీఎం జగన్ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju