రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విజయవంతంగా నెరవేరుస్తూ తాజాగా ఏపీలో కొత్త జిల్లాల కు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కొత్త జిల్లాలపై కసరత్తు కమిటీని ఏర్పాటు చేసిన ఆయన చాలా సింపుల్ గా ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేశారు. అయితే వాటి వెనుక ఎన్నో కీలక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లా ఏర్పాటు చేయడం అనే సింపుల్ స్టేట్మెంట్ వెనుక ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి.
వీటిలో అతిముఖ్యమైనది ప్రజల భావోద్వేగాలకు సంబంధించి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురు కానుండడం. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అనేక సమస్యలతో పాటు ఎన్నో అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు పక్కపక్కనే ఉండే గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో బాపట్ల లోక్సభ స్థానాన్ని తీసుకుంటే ప్రకాశం జిల్లాలో గుంటూరు జిల్లా కన్నా ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇదే సమయంలో వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా…. ప్రకాశం జిల్లా వారికి గుంటూరు జిల్లా వారిగా అనిపించుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. కొంతమంది ప్రకాశం జిల్లా వాసులకు గుంటూరు జిల్లావాసులుగా పరిగణింపబడడం నచ్చదు. ప్రకాశం జిల్లా వారికి వారి జిల్లా మీద ఉండే అభిమానం మిగిలిన వారి కంటే రెట్టింపుగానే ఉంటుంది. ఇదే సమయంలో మన జిల్లా నుండి మరొక కొత్త జిల్లా అనిపించుకోవడానికి బోలెడు మంది ససేమిరా ఒప్పుకోరు.
ఇదిలా ఉంటే ఇప్పటివరకు సీమకు చెందిన వారు కాస్త తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అటు చూస్తేనేమో మేం ‘కృష్ణా’ జిల్లా వాళ్ళని గొప్పగా చెప్పుకునేవారు తమకేం సంబంధం లేని గోదావరి జిల్లాలో భాగం కావడం వారికి ఇష్టం ఉండదు. కృష్ణా జిల్లాకు చెందిన వారిని తమతో కలుపుకోవడానికి గోదావరి జిల్లాల వారు స్వాగతించలేని పరిస్థితి. ఇక ఇదే సమయంలో జల వనరులు మరియు ఆర్థిక వనరులను కోల్పోవడం లేదా పక్కవారితో పంచుకోవడం కూడా ఇష్టం లేని వారు ఎంతమంది ఉంటారు. ఈ విషయాన్ని లోకల్ నేతల దృష్టికి తీసుకొని వెళ్ళి పెద్ద రభస చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పాజిటివ్ ల కన్నా నెగిటివ్ లే ఎక్కువ అని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా వైసిపి పరిగణలోకి తీసుకొని జిల్లాల విభజన చేపట్టాలని విశ్లేషకుల అభిప్రాయం. లేకపోతే మున్ముందు వారికే కొత్త సమస్యలు ఎదురవుతాయి.