నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్..!
నిమ్మగడ్డకు హైకోర్టు తాజా సూచనలు
ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్
ఏపీలో వివాదాస్పదంగా మారిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలిగింపు వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. రమేష్ కుమార్ ను తొలిగిస్తూ ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీని పైన హైకోర్టు గతంలోనే స్పష్టతమైన తీర్పు ఇచ్చింది. రమేష్ కుమార్ ను కొనసాగించాలని ఆదేశించింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అక్కడ కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ పైన కీలక వ్యాఖ్యలు ఎదురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం కోరిన విధంగా నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పు పైన మాత్రం స్టే ఇవ్వటానికి సుప్రీం నిరాకరించింది. ఇక, ఇప్పుడు రమేష్ కుమార్ ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేయటంతో..విచారించిన కోర్టు గవర్నర్ ను కలిసి హైకోర్టు తీర్పు అమలు చేయాలని కోరాలని సూచించింది. దీంతో..గవర్నర్ ను కలిసేందుకు నిమ్మగడ్డ సిద్దమవుతున్నారు. మరి..గవర్నర్ కోర్టు తీర్పు అమలు చేయమని జగన్ ప్రభుత్వానికి సూచిస్తారా..జగన్ ప్రభుత్వం దీనిని పాటిస్తుందా.. ఏం జరుగనుంది..ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
నిమ్మగడ్డకు హైకోర్టు కీలక సూచనలు…
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు గవర్నర్ కోర్టుకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నుండి నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా మారిన వ్యవహారం ఆ తరువాత ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలిగిస్తూ..అదే మయంలో తమిళనాడు కు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజన్ ను ఆ స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. రమేష్ ను తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం సైతం లభించింది. అయితే, దాని పైన నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లగా..విచారణ అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పు బట్టింది. రమేష్ కుమార్ ను తప్పించే అధికారం ప్రభుత్వానికి లేదని..ఆయన్ను కొనసాగించాలని ఆదేశించింది. దీంతో..వెంటనే ప్రభుత్వం సుప్రీం కోర్టులో హైకోర్టు తీర్పుపైన అప్పీల్ కు వెళ్లింది. అక్కడ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ వెనుక సదుద్దేశం ఉన్నట్లుగా లేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం..రెండు విచారణల తరువాత ఈ కేసును మూడు వారాల్లో ముగించాలని భావిస్తున్నామని చెబుతూ..మూడు వారాల పాటు కేసును వాయిదా వేసింది.
గవర్నర్ కోర్టుకు నిమ్మగడ్డ పంచాయితీ…
ఇదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసారు. కోర్టు ఆదేశించినా ఎస్ఈసీగా నియమించకపోవటంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మూడు సార్లు సుప్రీం కోర్టులో స్టే నిరాకరణ జరిగినా ఎందుకు నిమ్మగడ్డను తిరిగి నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. కేసును వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తూ.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక, ఇదే సమయంలో గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డకు ఆదేశించింది. ఒక వినతిపత్రం ఇవ్వాలని నిమ్మగడ్డకు సూచిస్తూ..హైకోర్టు తీర్పు అమలు చేయాలని గవర్నర్ ను కోరాలని నిమ్మగడ్డకు ఆదేశించిన హైకోర్టు. దీంతో..ఇప్పటికే గవర్నర్ ను కలవడానికి ఒకసారి అపాయింట్ మెంట్ తీసుకున్నామన్న నిమ్మగడ్డ తరపు న్యాయవాది ఎన్. అశ్వని కుమార్ కోర్టుకు వివరించారు. ఇప్పుడు నిమ్మగడ్డ కోర్టు సూచనల మేరకు గవర్నర్ ను కలిసిన తరువాత..గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేస్తారు..నిమ్మగడ్డ వ్యవహారాన్ని ప్రతిష్ఠగా భావిస్తున్న జగన్ ప్రభుత్వం గవర్నర్ ఏవైనా సూచనలు చేసినా..ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.