Akhanda: వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు “అఖండ” రూపంలో భారీ బ్లాక్ బస్టర్ గత ఏడాది పడిన సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. బాలయ్య బాబు కెరీర్ లో అత్యంత వేగంగా వంద కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. విదేశాలలో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… బోయపాటి టేకింగ్… బాలయ్య బాబు యాక్టింగ్… సినిమా చూసే ఆడియన్స్ నీ నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లారు. ఈ సినిమాతో నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు.
అఘోర గా బాలయ్య బాబు యాక్టింగ్… యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టే రీతిలో బోయపాటి తీయటం సినిమాకి హైలెట్ గా నిలిచాయి. గతంలో బోయపాటి తో బాలయ్య బాబు నటించిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో “అఖండ” కూడా విజయం సాధించటంతో హ్యాట్రిక్ విజయం సాధించినట్లయింది. ఇదిలా ఉంటే ప్రస్తుత రోజుల్లో మూడు వారాలు సినిమా ఆడటం గగనంగా మారింది. కానీ అఖండ సినిమా.. రాయలసీమ కర్నూలులో ఏకంగా వంద రోజులు ఆడటంతో.. సినిమా యూనిట్ మార్చి 12 వ తారీకు…STBC మైదానంలో 100 రోజుల వేడుక అంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అఖండ సినిమా యూనిట్ తో పాటు.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 100 రోజుల వేడుక అనేది గతంలో.. జరిగేవి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కరోనా టైంలో కూడా.. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు వంద రోజులు ఆడటంతో ఈ వేడుక ఘనంగా నిర్వహించాలని సినిమా నిర్మాతలు డిసైడ్ అయినట్లు సమాచారం.