Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో పని చేసే అన్ని రకాల వర్కర్లకు మరియు ఎంప్లాయిస్ కి ఫ్రీగా వ్యాక్సిన్ అందించబోతున్నాట్లు చిరంజీవి ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చురుగ్గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖ కంపెనీలు తమ ఆధీనంలో ఉండే వర్కర్లకు ఫ్రీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేస్తూ ఉన్నాయి.
ఈ తరుణంలో ఇండస్ట్రీలో పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి .. తెలుగు చలన చిత్ర రంగంలో పనిచేసే వర్కర్లకు ఫ్రీగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ప్రకటించడంతో ఎంప్లాయిస్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ లాంటి కష్ట సమయం లో “కరోనా క్రైసిస్ చారిటీ” సీసీసీ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేరిట.. నిధులు సేకరించి నిత్యవసర వస్తువులు అందించి ఆదుకుని, ఇప్పుడు కూడా ఇదే ట్రస్ట్ ద్వారా వ్యాక్సిన్ అందించడానికి చిరంజీవి ముందుకు రావటం నిజంగా సంతోషం అంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.