Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రంగం నుండి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటిలో చాలా స్లోగా సినిమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా సైరా సినిమాకు చాలా టైం తీసుకున్నారు. కానీ సైరా తర్వాత ఆచార్య స్టార్ట్ చేసి .. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తూ మరోపక్క వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. వేదాళం, లూసిఫర్ అదేవిధంగా ఇంకా చాలా సినిమాలను చిరంజీవి హెల్డ్ లో పెట్టడం జరిగింది. పాండమిక్ సీజన్ కొనసాగుతుండగానే ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో కుర్ర హీరోల కంటే.. ఎక్కువ సినిమాలు ఒప్పుకున్నా హీరోగా మొదటి వరుసలో ఉన్నాడు చిరంజీవి.
ఒకపక్క ఇండస్ట్రీలో అందరి బాగోగులు చూసుకుంటూ.. కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకుంటూ… మరో పక్క సినిమాలు పై కూడా దృష్టి పెడుతూ… కీలకంగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న.. సందీప్ రెడ్డి వంగా తో.. చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అయినట్లు తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఒక సిట్టింగ్ లో చిరంజీవికి స్క్రిప్ట్ వినిపించినట్లు టాక్.
ఈ క్రమంలో మరో సిట్టింగ్ లో కూర్చోవడానికి చిరంజీవి రెడీ అయినట్లు చాలావరకు స్క్రిప్ట్ కన్ఫర్మ్ అయినట్లు… ఫిలిం వర్గాలలో వార్తలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చిరంజీవికి చెప్పిన స్క్రిప్ట్ ఆయనతో కాదని ఆయన కుమారుడు రామ్ చరణ్ కి సంబంధించిన స్క్రిప్ట్ అని మరోపక్క కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సందీప్ రెడ్డి వంగా తో చిరంజీవి సిట్టింగ్ వేయటం స్క్రిప్ట్ వినటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల లో పెద్ద హాట్ టాపిక్ అయింది.