Devatha Serial: దేవి తన బిడ్డే అని తెలుసుకున్న ఆదిత్య. తను మనసారా ఒక్కసారైనా దేవిని హత్తుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి..! మాధవ్ ఆదిత్యను పిల్లలకు దూరం చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు..!? ఆ నిర్ణయానికి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారా..!? ముఖ్యంగా రాధ ఏముంటుందో..!? నేటి 442వ ఎపిసోడ్ హైలెట్స్ చూసేద్దాం..!!
ఏడుస్తూ వస్తున్న పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని రాధ మాధవ్ ని అడగగా . వాళ్ళనే అడుగు చెబుతారు అంటాడు. ఆఫీసర్ సార్ తనని చూడటానికి వస్తే నాన్న కలవనివ్వలేదని. ఆఫీసర్ సార్ కొట్టారని.. వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు మొత్తం వాళ్ళ అమ్మ తో దేవి చెబుతుంది. మాధవ్ ఇంట్లో వాళ్ళ అందరి ముందు పిల్లల్ని హాస్టల్ కి పంపిస్తున్నట్లు తన నిర్ణయం చెబుతాడు. రాధా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేను. ఈ నిర్ణయానికి నేను ఒప్పుకోను అంటుంది. ఈ విషయంలో నేను ఎవరి మాటా విననని తెగేసి చెప్పేస్తాడు. రాధా ఎంత నచ్చచెప్పినా మాధవా వినడు. పిల్లల్ని మనకి దూరం చేస్తున్నాడని, ఈ విషయంలో నీ మాట కూడా నేను వినని మాధవ్ చేపేస్తాడు రాధాకి. ఆదిత్య దేవిని చూడడానికి ఇంటికి పరుగుపరుగున వస్తాడు. మాధవ్ ఆదిత్య మధ్య జరిగే సంభాషణల్లో మళ్ళీ ఆదిత్య ను కొడతాడు. సార్ లోపలికి వెళ్ళండి అని మాధవ్ నీ లోపలికి పంపిస్తుంది. నువ్వు ఏం చెబుతావో నాకు తెలీదు.. ఆదిత్య మన పిల్లల్ని చూడడానికి ఇంకొకసారి రాకూడదు అని చెబుతాడు. రాధ ను ఆదిత్య పిల్లల్ని చూడటం మాధవ్ ఓకేనా నీకు కూడా ఇష్టం లేదా అని అడుగుతాడు రాధా నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది.
రేపటి ఎపిసోడ్ లో హాస్టల్ కి పంపించద్దు అని పిల్లలితో కలిసి రాధ అడగడంతో.. ఒక కండిషన్ కి పిల్లలు ఒప్పుకుంటే హాస్టల్ కి పంపించను అని చెబుతాడు.. ఆఫీసర్ సార్ మీ దగ్గరకి వస్తే మీరు తనతో మాట్లాడకూడదని తను ఏం చేసినా నాతో మాట్లాడకుండా ఉంటే హాస్టల్ కి పంపించనని మాధవ్ కండిషన్ కి పిల్లలు ఒప్పుకుంటారా..!? రాధ ఏ నిర్ణయం తీసుకుంటుందో రేపు చూద్దాం..