Bollywood: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ .. దేశంలో మృత్యుఘోష వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి మహమ్మారి రోడ్డు పక్కన పేదవాడిని మొదలుకొని ఐశ్వర్య వంతుని వరకు సెలబ్రిటీలను రాజకీయ నాయకులను ఎవరిని విడిచి పెట్టడం లేదు. ఊహించని విధంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతూ ఉండటంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇండియా ని ప్రేమించే దేశాలు.. ఆదుకోవటానికి తమవంతుగా వ్యాక్సిన్లు పంపించటం మరియు మెడిసిన్ లు అందిస్తూ ఉన్నాయి.
రోజుకి దాదాపు నాలుగు లక్షల పాజిటివ్ కేసులు బయటపడుతూ ఉండటంతో మరో పక్క ప్రముఖులు దేశంలో లాక్ డౌన్ మాత్రమే శరణ్యమని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో టాప్ హీరోయిన్ యోగా బ్యూటీ శిల్పాశెట్టి కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదేవిధంగా సౌత్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆమె మరియు భర్తతో పాటు కొడుకు కూడా మహమ్మారి బారిన పడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు సినీ ప్రముఖులు శిల్పాశెట్టి కుటుంబం త్వరగా కరోనా వైరస్ ని జయించాలని భగవంతునికి ప్రార్థనలు చేస్తున్నారు.
ఒక్క శిల్పాశెట్టి మాత్రమే కాక టాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా మంది సెలబ్రిటీలను వదిలి పెట్టడం లేదు వైరస్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కంటే ప్రస్తుతం ఇండియా లో వైరస్ ప్రభావం చాలా దారుణంగా ఉంది. మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాగాని.. కేంద్రం వ్యాక్సిన్ కొరత విషయంలో చేతులెత్తేసిన పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో మరోపక్క వైరస్ దాని పని అది చేసుకుంటూ వ్యాప్తి చెందుతూ ఉంది. దీంతో దేశంలో మామూలు పరిస్థితి ఎప్పుడు వస్తుందో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.