Jana Gana Mana: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రిమ్ ప్రాజెక్ట్ అయిన `జనగణమన` ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్లింది. ఇటీవలె రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో `లైగర్` వంటి పాన్ ఇండియా చిత్రాన్ని కంప్లీట్ చేసిన పూరీ.. మళ్లీ సేమ్ హీరోను రిపీట్ చేస్తూ `జనగణమన`ను అనౌన్స్ చేశాడు. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై వంశీ పైడిపల్లి, చార్మీ కౌర్ సంయుక్తంగా పాన్ ఇండియాలో లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎంపిక అయిందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారమే నిజమైంది. శనివారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ముంబైలో షురూ చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేకర్స్ బయటకు వదిలిన వీడియోతో ఈ విషయం కన్ఫార్మ్ అయింది. అయితే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ, హీరోయిన్ పూజా హెగ్డే, ఇతర తారాగణం, సాంకేతిక బృందం ఇలా అందరూ ఉన్నారు. కానీ, విజయ్ దేవరకొండ మాత్రం కనిపించలేదు. దీంతో విజయ్ ఎక్కడ, షూటింగ్లో ఎందుకు జాయిన్ కాలేదు అన్న ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం `ఖుషి` మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అందమైన ప్రేమ కథా చిత్రమిది. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ పూర్తైన వెంటనే విజయ్ ‘జనగణమన’ షూటింగ్లో జాయిన్ కానున్నాడట. ఈలోపు పూరి పూజా హెగ్డే మరియు ఇతర తారాగణంపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.