హీరోయిన్ కీర్తి సురేష్ దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కార్ వారి పాట”లో చేసి అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే అంతకుముందు అందాల నటి సావిత్రి బయోపిక్ “మహానటి” లేడీ ఓరియంటెడ్ సినిమాలో టైటిల్ పాత్ర చేయడం తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన చాలామందిని ఆకట్టుకుంది.
అంతేకాదు ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా గెలవడం తెలిసిందే. అచ్చం సావిత్రి మాదిరిగానే స్క్రీన్ పై “మహానటి” లో కీర్తి సురేష్ హావ భావాలు పలికించింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాకి కీర్తి సురేష్ నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే కేజిఎఫ్ రెండు భాగాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సెకండ్ పార్ట్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది.
అయితే రెండో భాగంలో చివరిలో మూడో పార్ట్ ఉన్నట్లు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హింట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం “కేజిఎఫ్ 3″ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా కేజిఎఫ్” నిర్మాణ సంస్థ లేడీ ఓరియంటెడ్ సినిమాగా చేయాలని అనుకుంటున్నాట్లు ఇందుకోసం కీర్తి సురేష్ నీ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఓ లేడీ డైరెక్టర్ తియనునట్లు టాక్. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “బోలాశంకర్”, నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” సినిమాలలో నటిస్తోంది. ఈ రెండు తర్వాత ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం.