టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులిపే స్టామినా ఉన్న హీరోల్లో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. అదేవిధంగా వెండితెరమీద విజువల్ వండర్ సృష్టించడంలో ఇండియాలో నెంబర్ వన్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు సినిమా ప్రేక్షకులు ఎప్పటినుండో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో అనేక టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలలో రాజమౌళి స్పష్టం చేయడం జరిగింది. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే దానిపై క్లారిటీ లేదు.
ప్రస్తుతం మహేష్ రాజమౌళి ఎవరికి వారు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఇంతవరకు ఈ కాంబో సెట్స్ మీదకి రాలేదు. మహేష్ ఏదైనా సినిమా మొదలు పెట్టే ముందు రాజమౌళి ప్రస్తావన ఇండస్ట్రీలో అభిమానులలో వస్తూనే ఉంది. మహేష్ కూడా ఆయా సందర్భాలలో ఆ మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు దాటవేస్తున్నారు తప్పా, ఎప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందో అనే దానిపై క్లారిటీ ఇవ్వటంలేదు. ఇక దిగ్గజ దర్శకుడు రాజమౌళి పరిస్థితి అయితే సరేసరి. విజువల్ వండర్ బాహుబలి కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు టైం కేటాయించినా జక్కన్న… ఇప్పుడు తీస్తున్న “RRR” కోసం మూడు సంవత్సరాలు పైగా టైం కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కంప్లీట్ అయితే గాని నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళి ది ఏంటి అనేదాన్ని విషయం లో క్లారిటీ లేదు. కాగా రాజమౌళి మహేష్ సినిమా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టారు బడా నిర్మాత కె.ఎల్ నారాయణ. దుర్గా ఆర్ట్స్ అధినేత కె ఎల్ నారాయణ గతంలో రాజమౌళి తో “సింహాద్రి” సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నారాయణ తో రాజమౌళి మరో సినిమాని చేస్తానని మాట ఇచ్చి మహేష్ సినిమా నిర్మాత నారాయణతో చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ గురించి ఓ వార్త లీక్ చేశారు.
ఇటీవల కెఎల్ నారాయణ పుట్టిన రోజు కావడం తో ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడ్వాన్స్ రాజమౌళి ఎప్పుడో తీసుకున్నారని, “RRR” సినిమా పూర్తవ్వగానే వచ్చే ఏడాది మహేష్ సినిమా ప్రాజెక్టు పనులు స్టార్ట్ అవుతాయి అని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే “RRR” సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తంమీద చూసుకుంటే వచ్చే ఏడాది ద్వితీయార్థం లో మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.