Manirathnam: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులలో మణిరత్నం ఒకరు. ఆయన ఏ సినిమా తీసిన హిట్ ఫ్లాప్ అనే ఆలోచన లేకుండా అందరూ చూసేందుకు విపరీతంగా ఆసక్తి చూపిస్తుంటారు. మణిరత్నం తీసిన సినిమాలలో ఎక్కువశాతం ఫ్లాప్గా నిలిచినవే. కానీ వాటికి విపరీతమైన అభిమానులున్నారు. ఇప్పటి తరం వారికి మణిరత్నం సినిమాలు ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పాల్సిందే. గత చిత్రం విలన్ వచ్చి చాలాకాలం అయింది. మధ్యలో కరోనా కారణంగా ఆయన రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పొన్నియన్ సెల్వన్ షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. సౌత్ అండ్ బాలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న ఈ సినిమాను మణిరత్నం రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.
కాగా, గతకొన్ని నెలల నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏదీ రాలేదు. టాలీవుడ్ లో రూపొందిన ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, కన్నడలో రూపొందిన కేజీఎఫ్ 2 అలాగే తమిళంలో రూపొందిన బీస్ట్ సహా మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు బాలీవుడ్లో రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా, పఠాన్ సహా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ డేట్ను లాక్ చేసుకున్నాయి. కానీ, పొన్నియన్ సెల్వన్ సినిమా అప్డేట్ మేకర్స్ ఇవ్వకపోవడంతో ఈ ఏడాదైనా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు న్నాయా అని అందరూ మాట్లాడుకున్నారు. దానికి తాజాగా ఈ మూవీ మేకర్స్ చెక్ పెడుతూ అప్డేట్ ఇచ్చారు.
Manirathnam: రెండవ భాగాన్ని వచ్చే ఏడాది..!
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ పీరియాడిక్ డ్రామాగా రెండు భాగాలుగా వస్తోంది. కల్కీ కృష్ణమూర్తి పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్రిష, విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు త్రిష పోస్టర్తో పాటు మిగతా నటులన్న కొత్త పోస్టర్ను వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రెండవ భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారని సమాచారం.