దక్షిణాది చిత్ర పరిశ్రమలోని సినిమాలను ఒక్కటిగా చేసే వేదిక సైమా(సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్). ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఖతార్ వేదికకానుంది. ఆగస్ట్ 15న తెలుగు, కన్నడ సినిమా అవార్డులను.. ఆగస్ట్ 16న తమిళ్, మలయాళ సినిమా అవార్డులను అందించనున్నారు. ఆగస్ట్ 15న జరగబోయే సైమా వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే ఆగస్ట్ 16న వేడుకలకు నేషనల్ యాక్టర్ మోహన్లాల్ అతిథిగా విచ్చేస్తున్నారు. ఇంకా తమిళం నుండి ధనుష్, కన్నడ నుండి యష్ తదితరులు హాజరవుతున్నారు.
previous post
next post