Prabash : ఒక మామ్మూలు హీరో ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తీరు అందరికీ తెలిసినదే. ‘ఈశ్వర్’ అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టి బాహుబలిగా బాక్షాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన వరకు ప్రభాస్ సినిమాలు ఎంచుకున్న తీరు న భూతో న భవిశ్యతి! ఇకపోతే డార్లింగ్ లేటెస్ట్ మూవీ పేరు రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కరోనా కొట్టిన దెబ్బ వలన వాయిదా పడిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Devatha Serial: సత్యను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడిన మాధవ్.! కమల శ్రీమంతానికి రాధ వస్తుందా..!?
Prabash : ‘రాధేశ్యామ్’ కహానీ ఇదే..
మన డార్లింగ్ తెరపై కనిపించి దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. అభిమానులు అతని సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు ప్రభాస్. ఇకపోతే ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ దుమ్ము దులుపుతోంది.
YCP MLA RK Roja: అనేక అవమానాలు ఎదుర్కొన్నానంటూ రోజా సంచలన కామెంట్స్..
‘రాధేశ్యామ్’ సినిమా డ్యూరేషన్ సంగతి..
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, ఈ సినిమాకి పాటలు ఒకరు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను మరొకరు ఇస్తున్నారు. అసలు విషయానికొస్తే, తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. హిందీ వెర్షన్కి సంబంధించిన రన్ టైమ్ 2:30 గంటలు ఉంటుందట. ఈ రన్ టైమ్ను ప్రస్తుతం లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్ డ్యూరేషన్ మాత్రం హిందీ కంటే తక్కువ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!