సోషల్ మీడియా పుణ్యంతో చాలా మంది టాలెంట్ ఈ ప్రపంచానికి తెలిస్తుంది. తెలుగులోనే బేబీ అనే గాయని ప్రతిభ గురించి అందరికీ తెలిసినట్లుగానే బాలీవుడ్లో రేణు మండాల్ ప్రతిభ గురించి తెలిసింది. రైల్వేస్టేషన్లో పాటలు పాడే ఈమె గొంతు లతా మంగేష్కర్లా ఉందంటూ ఆమె పాట పాడుతున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా తన సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ ఏకంగా ఆమె భారీ బహుమతిని ఇచ్చారని బాలీవుడ్ వర్గాల సమాచారం. రేణు మండాల్ గొంతుకు ఫిదా అయిన సల్లూ భాయ్ ఏకంగా ఆ సింగర్కు రూ.55లక్షల ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
previous post
next post