కమెమడియన్ సునీల్ ఫ్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఆయన మరణించారు అంటూ సోషల్ మీడియాలో వార్తొకటి వైరల్ అయ్యింది. అయితే దీన్ని ప్రారంభంలోనే గుర్తించిన సునీల్ దాని గురించి సోషల్ మీడియా ద్వారానే స్పందించారు. “నేను ఘోర ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎవరో వ్యూస్ కోసం చేసిన చిల్లర పని. దయచేసి ఎవరూ నమ్మవద్దు. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో నేను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాను“ అంటూ మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం వేగంగా న్యూస్ చేరాలంటే సోషల్ మీడియానే అందరికీ వేదికైంది. ఇలాంటి సదర్భంలో కొందరు వ్యూస్ కోసం చేసే చిల్లర పని వల్ల ప్రజల్లో ఏ వార్తను నమ్మాలి.. దేన్ని నమ్మకూడదో తెలియకుండా పోతుంది..