Sonu Sood: సోనుసూద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బేసిగ్గా వెండితెర విలన్ అయినటువంటి సోను కరోనా కష్ట కాలంలో ప్రజల్లో హీరోగా అవతరించాడు. ఈ క్రమంలో సోనూసూద్ మానవత్వానికి ప్రజలు జేజేలు పలికారు. ఆపత్కాలంలో ఆదుకున్న సోనూసూద్ ని ప్రజలు అంత ఈజీగా మర్చిపోలేరు. మల్టీ ట్యాలెంటెడ్ స్టార్ గా అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విలన్ గానే కాకుండా విభిన్న పాత్రలలో అతగాడు నటించి మెప్పించాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ ల ఆచార్య చిత్రంలో సోనూ విలన్ గా నటించిన సంగతి తెలిసినదే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టాలీవుడ్ ని అందుకే విడిచిపెట్టడట!
మొదట బాలీవుడ్లోనే ఎంటర్ అయినా, తన నటనతో ఆకట్టుకొని మిగతా సినిమా పరిశ్రమలలో కూడా సోను అవకాశాలు పొందాడు. ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమలో అతగాడిది మరువలేని ప్రస్థానమనే చెప్పుకోవాలి. ఓ దశలో బాలీవుడ్లో కంటే ఇక్కడే అతగాడు ఎక్కువ సినిమాలు చేసిన పరిస్థితి. అందుకే ఆయనకి మన టాలీవుడ్ అంటే ప్రత్యేకమైన గురి, అభిమానం. సోను పారితోషికం విషయంలో ఎక్కువగా ఇక్కడే సంపాదించాడని సమాచారం. తాజాగా ఓ మీడియా వేదికగా సోను మాట్లాడుతూ… “టాలీవుడ్ తో నాకున్న అనుబంధం వేరు.. దాన్ని ఎప్పటికీ వదులుకోను!” అని అన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మిగతా సమాచారం:
ఇకపోతే, సోను త్వరలో త్రివిక్రమ్, పూరి, కొరటాల వంటి వారితో పనిచేయనున్నాడు. ఇకనుండి సోనుకి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలే కాకుండా కాస్త పాజిటివ్ షేడ్స్ వున్న పాత్రలు కూడా ఆఫర్ చేస్తున్నారని వినికిడి. నెక్స్ట్ త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా కాంబోలో సోను ని తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అతనిది నెగటివ్/పాజిటివ్ రోల్ అనేది ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఈ సినిమాపై ఇంకా అధికార ప్రకటన ఏది వెలువడలేదు.