ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ స్టార్ట్ అయిపోయాయి. అంతమాత్రమే కాకుండా సినిమాలు కూడా థియేటర్లో రిలీజ్ అయిపోతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో రష్మిక మందన మంచి జోరు మీద ఉంది. గత ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న “పుష్ప” సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది.
అంత మాత్రమే కాక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే ఈ సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ అనే వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక మందన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అని అందరికీ తెలుసు. తన కెరీర్ గురించి ఇంకా అనేక పర్సనల్ విషయాల గురించి అభిమానులతో నెటిజన్లతో అనేక విషయాలు పంచుకుంటూ ఉంటది.
ఇలాంటి నేపథ్యంలో ఇంస్టాగ్రామ్ లో రష్మిక మందన ని అభిమాని మీకు జీవితంలో భయం అనిపించే విషయాల గురించి తెలపాలని ప్రశ్నించాడు. దానికి రష్మిక మందన ఇచ్చిన ఆన్సర్ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. తనకి సరీసృపాలు(భూచరాలు.. పాములు తొండలు) .. లోతైన చీకటి ప్రదేశాలు అంటే చాలా భయమని వెల్లడించింది. ఇదిలా ఉంటే తెలుగులో మాత్రమే కాక తమిళంలో అదేవిధంగా హిందీలో కూడా ఈ కన్నడ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది.