సూపర్స్టార్ మహేష్ హీరోగా తదుపరి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. `మహర్షి` సినిమాకు సంబంధించి రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా.. సమ్మర్ వేకేషన్ తర్వాత జూలై నుండి మహేష్ సినిమా సెట్స్కు వెళుతుందని సమాచారం. సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమాలో లేడీ సూపర్స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం విజయశాంతి ఈ సినిమాలో నటించడానికి నో చెప్పారట. ఎందుకంటే పాత్ర పరిధి చాలా తక్కువగా ఉండటమే కాక.. చిన్న పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తే, తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని విజయ శాంతి ఆలోచించడమే కారణాలంటున్నారు. 1989లో కొడుకు దిద్దిన కాపురం సినిమాలో విజయశాంతి కొడుకుగా మహేష్ నటించారు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి నటిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.