Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. బ్యాకింగ్ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేశ్ బాబు నుంచి బాగానే గ్యాప్ వచ్చిన కారణంగా ఆయన అభిమానులు సర్కారు వారి పాట సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అటు హీరో మహేశ్, ఇటి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాలో పోకిరి వైబ్స్ కనిపిస్తాయని చెప్పి అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు పెంచారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ క్రేజీగా ఉండటం మరింతగా అందరిలో అంచనాలు పెరగడానికి కారణం అయింది. ఇక మహేశ్ ముద్దుల కూతురు సితార ఈ సినిమాలో కనిపించబోతోంది. దాంతో ఘట్టమనేని అభిమానుల్లో ఆ రకంగానూ అంచనాలు ఆతృత బాగానే ఉన్నాయి.
Mahesh: ఇదే మహేశ్ సినిమాకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే, సర్కారు వారి పాట చిత్రాన్ని మే 12 న భారీ స్థాయిలో రిలిజ్ చేస్తున్నారు. మహేశ్ గత చిత్రాలు యూఎస్ లో భారీ వసూళ్ళు రాబట్టాయి. దాంతో అక్కడ ఈసారి భారీ స్థాయిలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ, హాలీవుడ్ సినిమా ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ కూడా అదే వారంలో రిలీజ్ కాబోతోంది. యూఎస్ లో ఈ మూవీ మే 6న విడుదల కాబోతోంది. ఆ తరువాత ఇండియాలోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు క్రేజ్ ఉంటుంది. ఇదే మహేశ్ సినిమాకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.