Puspha 2: పుష్ప- ది రైజ్ పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనే క్రేజ్ను సంపాదిన్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పక్కా ప్లాన్తో దిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ సక్సెస్ అందుకున్నాడు. పుష్ప 1 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లను సాధించడంతో అక్కడ మారెక్ట్ మీద పట్టు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు అల్లు అర్జున్కు బాలీవుడ్లో మేకర్స్ అవకాశాలివ్వడానికి ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే ఓ హిందీ స్ట్రైట్ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది.
ఇక పుష్ప- 1 ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ పార్ట్-2 మీద దృష్టి పెట్టారు. ఏప్రిల్ నుంచి సినిమాను ప్రారంభిస్తామని కూడా ఇటీవలే చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా సమాచారం మేరకు.. ఇప్పటికే పుష్ప 2 ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట. దర్శకుడు సుకుమార్ ..టీమ్
లోని నటీనటులతో పాటు అల్లు అర్జున్ ఈ మీటింగ్ లో ఉన్నట్టు సమాచారం.
Puspha 2: పుష్ప 2 ఈ ఏడాది రిలీజ్ చేసే అవకాశాలు చాలా తక్కువ
అయితే, ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పుష్ప పార్ట్ 2 ను విడుదల చేయడం సాధ్యమేనా అని చర్చించుకుంటున్నారట. అందుకు కారణం ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలవకపోవడమే అంతేకాదు సుకుమార్ సినిమా మేకింగ్ కోసం చాలా సమయం తీసుకుంటారు. అందుకే షూటింగ్ ఎంత కాదన్న ఏడెనిమిది నెలలు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఈ ఏడాది రిలీజ్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకుంటున్నారు. ఇక ఏప్రిల్ లేదా మే నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రష్మిక మందన్న ఇందులో హిరోయిన్గా కంటిన్యూ అవుతోంది. మైత్రీ మూవీస్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.