NTR Kalyan Ram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. 2024 ఎన్నికలను అక్కడ ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుండగా…టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఎన్టీఆర్ రావాలని చాలామంది కార్యకర్తలు నాయకులు కోరుతూ ఉన్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్టీకి ఎవరు సేవ చేయాలనుకుంటే వారు ముందుకు వస్తారని అది వాళ్ళ ఇంట్రెస్ట్ అని ఎవరి మీద ఒత్తిడి తీసుకురామని తెలిపారు.
పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో జరగబోయే ఎన్నికల విషయంలో కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ ఎవరికి మద్దతిస్తారు అని “డెవిల్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో యాంకర్ కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ చాలా వరకు సైలెంట్ అయ్యి కొంతసేపు ఆలోచించి.. కుటుంబంతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సినిమాకు రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఎన్టీఆర్ తోపాటు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో దీనిపై చర్చిస్తామని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తో చేస్తున్న “దేవర” సినిమా గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి అయిపోయింది అని అన్నారు.
మొదటి భాగం కంప్లీట్ అయిన తర్వాత రెండో భాగం స్టార్ట్ చేస్తాం. పక్క ప్లానింగ్ తో సినిమా షూటింగ్ జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక తన కొత్త సినిమా “డెవిల్” గురించి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టకపోవడంతో.. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ తన తమ్ముడు అని జీవితాంతం అన్నదమ్ములుగానే ఉంటామని మా బంధాన్ని ఎవరు విడదీయలేరని కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఇలాంటి ఆలోచన మనసులో ఉన్న తీసేసుకోవాలని సూచించారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!