Most Expensive Indian Films: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సౌత్ మరియు నార్త్ సినిమాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించేది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీస్లో ఎవరి దారి వారిదే. సూపర్ స్టార్లైనా వారి వెలుగు వారి భాషకు మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉండేది. కానీ పాన్ ఇండియన్ కల్చర్ వచ్చాక సినిమాల మధ్య భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. కంటెంట్ బాగుంటే ఏ భాషలో అయినా సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. హీరోలు ప్రాంతీయ స్టార్స్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
అలాగే సినిమాల బడ్జెట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక సినిమాను అనౌన్స్ చేయగానే హీరో, హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ ఎవరు..? ప్రొడ్యూసర్ ఎవరు..? వంటి విషయాలతో పాటు సినిమా బడ్జెట్ ఎంత..? అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు అగ్ర హీరోలు సినిమాలకు మాత్రమే బడ్జెట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా నిర్మాతలు రూ. 50 కోట్ల రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మన ఇండియన్ సినీ పరిశ్రమంలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన టాప్-10 మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ మన తెలుగు సినిమాకే దక్కింది. ఆ సినిమా మరేదో కాదు ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. డి.వి.వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూ. 550 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ అంటే స్థాయిలో నిర్మించారు. విడుదల తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ దాదాపు రూ. 1400 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టి.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటి చెప్పింది.
అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన ఇండియన్ సినిమాల్లో రెండో స్థానాన్ని ఆదిపురుష్ సొంతం చేసుకుంది. రామాయణగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బడ్జెట్ అక్షరాల రూ. 500 కోట్లు. అయితే ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలాగే మూడో స్థానంలో 2.0 చిత్రం నిలించింది. ఈ 3D సైన్స్-ఫాంటసీ యాక్షన్ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేస్తే.. శంకర్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించారు.
హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్ లిస్ట్ లో బ్రహ్మాస్త్ర నాలుగో స్థానంలో ఉంది. 2022లో విడుదలైన బాలీవుడ్ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రమిది. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ చిత్రంలో నటించారు. రూ. 375 బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర మూవీ నిర్మించబడింది. అలాగే ఐదో స్థానంలో ప్రభాస్ సాహో నిలిచింది. రూ. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. 2019లో విడుదలైన సాహో పరాజయం పాలైంది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ చిత్రం భారీ వసూళ్లను అందుకుంది. బాలీవుడ్ మూవీ బడే మియాన్ చోటే మియాన్ చిత్రాన్ని కూడా రూ. 350 కోట్ల బడ్జెట్ తోనే నిర్మించారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో ప్రభాస్ రాధే శ్యామ్, బాలీవుడ్ యాక్షన్-అడ్వెంచర్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3, దళపతి విజయ్ లియో చిత్రాలు వరుసగా నిలిచాయి. ఈ సినిమాలను రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!