Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. గెలిచిన తర్వాత మరీ చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నట్లు కొన్ని వీడియోలు అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట దాడులు జరగడం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కొంతమంది కంట్రీన్స్ కారులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో చాలామంది పోలీసులు.. రావడం జరిగింది. లాఠీచార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ నీ సైలెంట్ గా వెళ్ళిపోమని.. ఆదేశాలిస్తే ముందు సైలెంట్ గా కారు పట్టుకుని వెళ్లిపోయారు. తర్వాత రెండోసారి మళ్లీ వెనక్కి వచ్చి ర్యాలీగా బయలుదేరడంతో అతనిపై పోలీసులు కేసులను నమోదు చేయడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే.. పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లిపోయాక కొంతమంది మీడియా ప్రతినిధులపై విమర్శలు కూడా చేయడం జరిగిందంట. ఈ విషయాన్ని స్వయంగా యాంకర్ శివ తెలియజేశారు. వెబ్ మీడియాలో యాంకర్ శివ అందరికీ సుపరిచితుడే. ఓటిటి బిగ్ బాస్ షోలో కూడా ఆడటం జరిగింది. ఈ క్రమంలో యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ వ్యవహరించిన తీరుని ఇంస్టాగ్రామ్ లో పోస్టులో వివరించారు. నీకు ఎందుకురా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని కొంతమందికి దురుసుగా మెసేజ్ లు పెట్టారట. నాకు ఒక్కడికే కాదు పదిమంది చానల్స్ కి ఈ రకంగానే రిప్లై ఇచ్చాడు. వాళ్లంతా వదిలేసారు నేను ఫైట్ చేస్తున్నా అని యాంకర్ శివ తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో ప్రశాంత్ గెలిచాడా లేకపోతే సింపతి గెలిచిందా..అని సంచలన స్టేట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. హౌస్ లో అందరూ నామినేట్ చేయగానే అయ్యయ్యో ప్రశాంత్ అని అందరూ ఓట్లు వేశారు అంతే. అంటే మీరు అందరూ పాపం పాపం అని ఓట్స్ వేసేశారు.
అసలు ప్రశాంత్ బిహేవియర్ ఆపింది శివాజీ గారు. ఆ శివాజీ గారు లేకపోయి ఉంటే… ప్రశాంత్ ఏంటో అందరికీ తెలిసేది. ఆఖరికి బిబిసి న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా నాతో వెయిట్ చేస్తే వాళ్ళని కూడా విమర్శించాడు. ఇంతలా ఎందుకు స్పందించాను అంటే.. ఇది నా వృత్తి. రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా మాట్లాడటం నచ్చలేదు. చెప్పే విధానం ఒకటి ఉంటది భయ్యా నాకు చాలా మంది ఇంటర్వ్యూ ఇవ్వను అన్నారు. అందరి కోసం ఎలా పెట్టలేదు కదా..? ఈ క్రమంలో సహాయం చేసిన ఫ్రెండ్స్ మరియు మద్దతు దారులపై కూడా ప్రశాంత్ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడడాన్ని.. వాటికి సంబంధించిన ఆడియోలు..వీడియోలతో వస్తాను అని యాంకర్ శివ పోస్ట్ పెట్టడం జరిగింది.