Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ చివరి దశకు చేరుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్ వారం ఆట సాగుతోంది. సీజన్ సెవెన్ లో మొత్తం 19 మంది ఎంట్రీ ఇస్తే..చివరివారానికి ఆరుగురు మిగిలారు. వీరిలో ఒకరు టైటిల్ గెలుస్తారు. శుక్రవారంతో ఓట్ల ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో బయట టైటిల్ ట్రోఫీ విజేతకి సంబంధించి రకరకాల వార్తల వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్, యావర్, అమర్, శివాజీ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మిగతా సభ్యులు అర్జున్ మరియు ప్రియాంక… పేర్లు అంతగా వినబడటం లేదు. ఈసారి సీజన్ ఎవరి అంచనాలకు అందకుండా…ఉల్టా పుల్టా.. మాదిరిగానే షో నడిపించడం జరిగింది.
వైల్డ్ కార్డు రూపంలో ఏకంగా ఐదుగురు ఎంట్రీ ఇవ్వడం… ఎలిమినేట్ అయిపోయిన రతిక మళ్లీ గేమ్ ఆడటం.. చూస్తున్న ప్రేక్షకులకు హౌస్ లో ఆడుతున్న సభ్యులకు ఊహించని షాక్ లు పడ్డాయి. ఇదిలా ఉంటే ఈసారి సీజన్ సెవెన్ లో ఫైనల్ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారట. బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే.. డిసెంబర్ 17 ఆదివారం జరగనుంది. సీజన్ సిక్స్ ఎవరూ లేకుండా ఏదో షో అలా ముగించటంతో.. తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి గ్రాండ్ ఫినాలే… చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయడం జరిగిందట. ఈ క్రమంలో ఫైనల్ ఎపిసోడ్ కి ముఖ్యఅతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అంతేకాదు చాలామంది సింగర్స్.. హీరోయిన్లు.. ఫైనల్ ఎపిసోడ్ లో సందడి చేయనున్నట్లు సమాచారం. దీంతో మహేష్ చేతుల మీదుగా ఎవరు టైటిల్ అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమా “గుంటూరు కారం”.. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో రెండు సాంగ్స్ కూడా విడుదల కావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మహేష్ బిగ్ బాస్ షోకి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు వార్త రావటం సంచలనంగా మారింది.