Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారంతో ముగిసింది. 105 రోజులు జరిగిన ఈ షోలో 19 మంది టైటిల్ కోసం పోటీ పడగా రైతు బిడ్డ ప్రశాంత్ గెలవడం జరిగింది. అయితే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట దాడులు జరగడం తెలిసిందే. రోడ్డుపై అమర్ మరియు ప్రశాంత్ అభిమానులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది. అదే సమయంలో ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు. ఈ ఘటనపై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ బిగ్ బాస్ షో నిర్వహకులపై నాగార్జునపై కూడా సీరియస్ అయ్యారు. అంతేకాదు సిపిఐ నారాయణ సైతం మండిపడటం జరిగింది.
ఈ షో బ్యాన్ చేయటానికి న్యాయపోరాటం చేసిన వ్యవస్థలు సహకరించటం లేదని వ్యాఖ్యానించారు. డబ్బు కోసం కక్కుర్తి పడి… నాగార్జున యాంకర్ గా చేస్తున్నారని కూడా విమర్శించారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పై పోలీస్ కేసు కూడా నమోదు కావడం జరిగింది. దీంతో పల్లవి ప్రశాంత్ తనపై నమోదైన కేసులు గురించి తాజాగా మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట ఎవరెవరో గొడవలు పడితే తనకి ఏం సంబంధం అని అన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. పంట పండితే పండించిన వారికి బాధ ఉంటుంది. ఎవరిదో ఎండి పోతే వాడిపై వేస్తానంటే ఎలా..?. నేను గెలుచుకున్న 35 లక్షల రూపాయలు రైతులకి పంచుతాను. ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను.
ఈ క్రమంలో మీడియా ప్రతినిధి అంతకుముందు రైతులకు ఎందుకు సాయం చేయలేదని అనగా.. నాకు సీఎం పదవి లేదా ఏదైనా పదవి ఇస్తే వాళ్లకు న్యాయం చేసే వాడిని అని.. పల్లవి ప్రశాంత్ స్పష్టం చేయడం జరిగింది. ఈ సీజన్ అన్ని రకాలుగా సక్సెస్ సాధించింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అయిపోయిన ఈ దుర్ఘటన మాత్రం షోపై భయంకరమైన నెగిటివిటీ బయట క్రియేట్ చేసింది. చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.