పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇంటర్నేషన్ల్ లెవల్లో విడుదల కాబోతోంది.
అయితే అదే రోజు ప్రభాస్తో పోటీ పడబోతున్నారట నటసింహం నందమూరి బాలకృష్ణ. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం బాలయ్య తన తదుపరి చాత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రారంభించారు. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
ప్రభాస్ వచ్చాడు కానీ.. ఫ్యాన్స్ను ఉసూరుమనిపించారు!
కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా నటిస్తుంటే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ సినిమా మొదట దసరాకు విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అఖండ రిలీజ్ అయిన డిసెంబర్ 2న `ఎన్బీకే 107` వస్తోందని వార్తలు వచ్చాయి. కానీ, లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
వరుస ఫ్లాపులు పడినా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమా అంటే అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇక బాలయ్య పాన్ ఇండియా స్టార్ అవ్వకపోయినా.. ఆయన ఇమేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తోందంటే.. థియేటర్స్ దగ్గర హడావుడి వేరె లెవల్లో ఉంటుంది. ఇలాంటి ఇద్దరు హీరోలు ఒకే సారి, ఓకే రోజు పోటీ పడితే.. బాక్సులు బద్దలవ్వడం, బాక్సాఫీస్లు షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.