Brahmamudi Serial జూన్ 30th 136 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిపోతూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏమి జరిగిందోయ్ ఒకసారి చూద్దాము.
రాహుల్ ని అవమానించినందుకు రాజ్ ని నిలదీసిన రుద్రాణి :
రాహుల్ ని ఆఫీస్ డబ్బులు వాడినందుకు రాజ్ ఆఫీస్ లో అందరి ముందు నిలదీసి ప్రశ్నిస్తాడు. ఈ విషయాన్నీ తెలుసుకున్న రుద్రాణి ఎంతో ఫీల్ అయిపోయి రాజ్ ని నిలదీస్తుంది. నా కొడుకు నీకు ఎలా కనిపిస్తున్నాడు రాజ్?, అటెండర్ లాగ కనిపిస్తున్నాడా?,వాడిని అందరి ముందు అలా ఎందుకు అవమానించావ్ అని అడుగుతుంది. అప్పుడు రాజ్ తప్పు చేసినప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు ప్రశ్నించాలి?, ఆఫీస్ డబ్బులను దుబారా ఖర్చులకు వాడుకున్నాడు, అది తప్పు కాదా?, ఏమాత్రం బాధ్యతలు తెలియకుండా పెరిగితే ఇలాంటి తప్పులు ముందు ముందు చేస్తూనే పోతాడు అందుకే అందరి ముందు నిలదీసాను అని అంటాడు.
Nuvvu Nenu Prema: అను ఆర్యాల పెళ్లి సందడి మొదలు.. కృష్ణ గురించి పద్మావతి విక్కీ కి చెప్పనుందా..
మరోసారి తప్పు చేస్తే కంపెనీ నుండి రాహుల్ తీసేస్తాను అంటూ రుద్రానికి వార్నింగ్ ఇచ్చిన రాజ్ :
అలా అయితే కళ్యాణ్ కూడా బాధ్యతలు లేకుండానే తిరుగుతున్నాడు కదా, అతడిని ఎవరూ ఏమి అనరే, తిని తిరగడం తప్ప అతను ఏమి చేస్తున్నాడు అని అంటుంది. ఈ మాట అన్నందుకు ధాన్య లక్ష్మి మరియు ఆమె భర్త రుద్రాణి పై చాలా తీవ్రంగా విరుచుకుపడుతారు. ఆ తర్వాత రాజ్ మాట్లాడుతూ రాహుల్ లాగానే కళ్యాణ్ కూడా బోర్డు మెంబెర్..మాకు ఖర్చు పెట్టుకోడానికి దేవుడు బోలెడంత డబ్బులు ఇచ్చాడు, కానీ ఎన్నడూ కూడా జల్సా లు చెయ్యలేదు, ఇష్టమొచ్చినట్టు ఆడపిల్లలతో తిరుగుతూ పార్టీలు , పబ్బులు అంటూ పోలేదు. కానీ నీ కొడుకు చేసాడు, కళ్యాణ్ కి అలాంటి అలవాట్లు ఏమి లేవు, వాడికి ఇంకా వయస్సు రాలేదు, అప్పుడే బాధ్యతలు ఎందుకు అని అప్పగించలేదు అంతే. ఇలా అనవసరంగా కళ్యాణ్ గురించి మాట్లాడితే ఊరుకోను, మరోసారి రాహుల్ ఇలాగే బాధ్యత లేకుండా వ్యవహరిస్తే నా కంపెనీ నుండి తీసేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు రాజ్.
స్వప్న మూలిక కలిపిన పాలను తాగేసిన రాజ్ :
ఆ తర్వాత పక్కకి వెళ్లి రుద్రాణి అన్నమాటలను తల్చుకుంటూ బాధపడుతుంటారు రాజ్, అది గమనించిన అపర్ణ దగ్గరకి రాజ్ దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. చిన్నప్పటి నుండి నేను రాహుల్ ని కళ్యాణ్ తో సమానంగానే చూసాను కదా అమ్మా, అత్త ఎందుకు అలా అపార్థం చేసుకుంటుంది అని అంటాడు. ఎవరినైనా ఏమైనా అనే అధికారం, ఆమెకి ఈ ఇంటి ఆడపడుచు అని ఇచ్చిన స్థానం వల్ల వచ్చింది. ఆడపడుచు ని ఈ కుటుంబం ఎంత మర్యాదగా చూస్తుందో తెలిసి, తన అధికారం చెలాయిస్తోంది మీ అత్త అని అంటుంది. అయినా రాహుల్ తప్పు చేసి దొరికిపోయాడు, కళ్యాణ్ అలాంటి తప్పులు ఎన్నడూ చెయ్యలేదు, తప్పు చేసిన వాడిని మందలించకపోతే ఇంకా తప్పులు చేస్తూనే పోతాడు కదా అని అంటాడు రాజ్.
వాడు ఈ జన్మకి మారడు రాజ్, అయినా అంత తప్పు చేసినా కూడా నువ్వు ఎలా రాహుల్ ని క్షమించవు అని అడగగా, చిన్నప్పటి నుండి కళ్యాణ్ తో పాటు వాడితో కూడా కలిసి పెరిగాను కదా అమ్మా , వాడి తప్పులను కూడా అంగీకరించాలి కదా అని అంటాడు. ఇదంతా విన్న కావ్య రాజ్ మనసు ఎంత గొప్పది అని మనసులో అనుకుంటుంది. మరోపక్క స్వప్న ఈరోజు ఎలా అయినా రాహుల్ తో శోభనం జరిపించుకోవాలి అనే ఉద్దేశ్యం తో పాలలో మూలిక కలుపుతుంది. ఆ తర్వాత ఫోన్ రాగానే పక్కకి వెళ్లి మాట్లాడుతూ, రాహుల్ కి ఇవ్వాల్సిన గ్లాస్ ని కాకుండా, మూలిక కలపని పాలని తీసుకెళ్తుంది. మరో పక్క కావ్య నేను ఇస్తే రాజ్ పాలు తీసుకోడని, పని మనిషి చేత అపర్ణ అమ్మగారు ఇచ్చారని చెప్పి ఇవ్వు అని పంపిస్తుంది. రాజ్ ఆ మూలిక కలిపిన పాలు తాగేస్తాడు. స్వప్న ఇచ్చిన పాలని తాగి ఎలాంటి రాహుల్ లో ఎలాంటి రియాక్షన్ లేకుండా పడుకోవడం చూసి అదేంటి ఎలాంటి రియాక్షన్ లేదు అని అనుకుంటుంది స్వప్న. మరోపక్క రాజ్ మూలిక కలిపిన పాలు తాగి కావ్య వద్దకి కైపు తో వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!